అయోధ్యనగర్లో పూర్తైన కల్వర్టు నిర్మాణం
ఇక నుంచి రాకపోకలకు సులభతరం
రూ.49 లక్షలతో కల్వర్టు..
రూ.1.5కోట్లతో సీసీరోడ్డు నిర్మాణ పనులు
హర్షం వ్యక్తం చేస్తున్న స్థానికులు, ప్రయాణికులు
కుత్బుల్లాపూర్,మే26: నిత్యం వాహనాలతో రద్దీగా మారే ప్రాంతం.ఒక వాహనం అటు వెళ్లితే మరో వాహ నం ఇటు రావాలంటే చాలా కష్టతరంగా మారేది. ట్రాఫిక్కు అంతరాయం జరిగితే తీవ్ర ఇబ్బందులు. వీటిని అధిగమించి సమాయానికి గమ్యస్థానాలకు చేరాలంటేనే ఆ దారి గగనతరంగా మారేది. ఇప్పుడు అలాంటి సమస్యకు చింత లేకుండా పోయింది. దాదాపుగా రెండేం డ్ల తర్వాత ఆ మార్గాన్ని సులభతరం చేశారు. ఇప్పుడు ప్రయాణికు లు, వాహనదారులతో పాటు పాదచారులకు సైతం ఎలాంటి ఇబ్బందులు లేకుండా దూరంగా మారిన ప్రయాణాన్ని దగ్గర చేయడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కోటి 54 లక్షలతో కల్వర్టు, సీసీరోడ్డు పూర్తి
కుత్బుల్లాపూర్ విలేజ్ నుంచి అయోధ్యనగర్ మీదుగా షాపూర్నగర్కు వెళ్లే ప్రధాన రహదారితో పాటు సుచిత్ర మార్గం వైపునకు వెళ్లే ప్రధాన దారికి అనుగుణంగా ఉండే ఈ దారి నిర్మాణానికి రూ.కోటి 5లక్షలతో కుత్బుల్లాపూర్ మూలమలుపు నుంచి షాపూర్నగర్కు వెళ్లే ప్రధాన మార్గమధ్యలో ఉన్న ఇండస్ట్రీయల్ వరకు సీసీరోడ్డు నిర్మాణంతో పాటు మార్గమధ్యలోని అయోధ్యనగర్లో రూ.49 లక్షలతో కల్వర్టు నిర్మాణాన్ని పూర్తి చేశారు. సుమారు మూడు కిలో మీటర్ల వ్యత్యాసంతో సీసీరోడ్డు నిర్మాణాన్ని వెడల్పుగా వచ్చిపోయే వాహనాలకు ఇబ్బందులు తలెత్తకుండా రోడ్డు మార్గాన్ని సుగమం చేశారు. ఒకప్పుడే సుచిత్ర మీదుగా కుత్బుల్లాపూర్ నుంచి షాపూర్నగర్, షాపూర్నగర్ నుంచి కుత్బుల్లాపూర్ మీదుగా సుచిత్ర వైపుకు వెళ్లాలంటే మార్గమధ్యలోని కుత్బుల్లాపూర్ గ్రామంలో మూలమలుపులతో పాటు ఇరుకైన సింగిల్ రోడ్డుమాత్రమే ఉండేది. దీనికి తోడు దాదాపుగా 7 కిలోమీటర్ల వ్యత్యాసాన్ని కేవలం ఇప్పుడు మూడు కిలోమీటర్ల మేరా సులభతరంగా రాకపోకలు సాగేలా ఈ దారిని తీర్చిదిద్దారు.
ఇండస్ట్రీయల్కు ఎంతో మేలు…
నర్సాపూర్,నిజామాబాద్ ప్రధాన రహదారికి మార్గమధ్యలో ఈ దారి గుండా ఇండస్ట్రీయల్ ప్రాంతాలకు వెళ్లాలంటే ఈ దారి ఇప్పుడు అనువుగా మారింది. రెండు ప్రధాన రహదారుల మధ్య ఉన్న జీడిమెట్ల ఇండస్ట్రీయల్కు నిత్యం అనేక ముడిపదార్థాలు, ఇతర వస్తువులతో భారీ వాహనాలు వచ్చిపోతుండేవి. దీనికి తోడు ఇదే మార్గం గుండా అల్వాల్ నుంచి ఐడీపీఎల్, బాలానగర్కు వెళ్లాలంటే ప్రత్యామ్నాయంగా ఈ దారి ఉండేది. దీంతో వాహనాల రద్దీగా విఫరీతంగా ఉండడంతో ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని చూపేందుకు ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ఈ దారిని అభివృద్ధి చేయడంతో వాహనదారులు,పాదచారులుహర్షం వ్యక్తం చేస్తున్నారు.