మన్సూరాబాద్, సెప్టెంబర్ 2 : ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు క్వాలిఫైడ్ టీచర్లతో విద్యాభోధనలు చేస్తూ నాణ్యమైన విద్యను ప్రభుత్వం అందిస్తుందని ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి తెలిపారు. నాగోల్ డివిజన్ పరిధి నాగోల్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణ పనులకు గురువారం ఎమ్మెల్సీ యెగ్గె మల్లేశం, ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గుప్తలతో కలిసి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలను తలదన్నేరీతిలో ప్రభుత్వ పాఠశాలలను ప్రభుత్వం తీర్చిదిద్దిందని తెలిపారు. కార్యక్రమంలో నాగోల్ డివిజన్ కార్పొరేటర్ చింతల అరుణ, స్కూల్ కమిటీ చైర్మన్ శ్రీధర్గౌడ్, నోసా అధ్యక్షుడు కందికంటి కన్నాగౌడ్, ప్రధాన కార్యదర్శి మేకల సత్యనారాయణ, ప్రధానోపాధ్యాయురాలు లక్ష్మీదేవి, నాయకులు అనంతుల రాజిరెడ్డి, చెరుకు ప్రశాంత్గౌడ్, చంద్రశేఖర్ ఆజాద్, తూర్పాటి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.