కేపీహెచ్బీ కాలనీ, జూన్ 21 : రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సర్వమాలకు సమప్రాధాన్యతనిస్తూ సుపరిపాలన సాగిస్తున్నారని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా.. బుధవారం కూకట్పల్లి రామాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ, మూసాపేట సర్కిల్ ఉపకమిషనర్ రవికుమార్, ఆలయ కమిటీ సభ్యులున్నారు.
కేపీహెచ్బీ కాలనీ చర్చిలో ప్రార్థనలు..
ప్రజలందరూ ఒకటేనని చాటుతూ పరిపాలన సాగిస్తున్న ఘనత సీఎం కేసీఆర్దని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. కేపీహెచ్బీ కాలనీ మొదటి రోడ్డులోని లూథరన్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్ మందడి శ్రీనివాస్రావు, డీసీ రవికుమార్, పాస్టర్లు, మైనార్టీ సోదరులున్నారు.
కూకట్పల్లి మసీదులో ప్రార్థనలు..
కూకట్పల్లి మసీదులో కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ ప్రార్థనలు చేశారు. కార్యక్రమంలో సదర్ సబ్బర్, మాజిద్, ముజీద్, స్థానిక నేతలున్నారు.
ఘనంగా ఆధ్యాత్మిక దినోత్సవం
బాలానగర్, జూన్ 21 : తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఆధధ్యాత్మిక దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకోవడం అభినందనీయమని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. బుధవారం బాలానగర్ డివిజన్లో గురుద్వారాకు వెల్లి సిక్కులతో కలిసి ప్రార్థన చేయగా ఓల్డ్బోయిన్పల్లిలో బడే మసీదులో మైనార్టీలతో కలిసి ఆయన ప్రార్థనలు చేశారు. కార్యక్రమంలో మందడి సుధాకర్రెడ్డి, అంబటి సునిల్ కుమార్, మెగుడంపల్లి కిరణ్ కుమార్ గుప్త, దారం సతీశ్, యెలిజాల యదగిరి స్థానికులు తదితరులు పాల్గొన్నారు.
సర్వమతాలకు ప్రాధాన్యం
అల్లాపూర్,జూన్21: సీఎం కేసీఆర్ సారథ్యంలో సర్వమతాలకు సమప్రాధాన్యం ఇస్తున్నారని కార్పొరేటర్ సబీహాబేగం అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా డివిజన్ పరిధిలోని దేవాలయాలు, మసీదులు, చర్చిల్లో ఆధ్యాత్మిక ఉత్సవాలు నిర్వహించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు లింగాల ఐలయ్య, జ్ఞానేశ్వర్, మల్లికార్జున్, నాగరాజు, పార్వతమ్మ, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.