మల్కాజిగిరి : ప్రజల ఆరోగ్యం, సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తానని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి (MLA Marri Rajasekhar Reddy) అన్నారు. గురువారం బోయిన్పల్లి క్యాంప్ కార్యాలయంలో అల్వాల్ మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవనాల నిర్మాణ పనుల గురించి పంచాయతీరాజ్ శాఖ అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అల్వాల్ మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణపనులు వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు.
బీఆర్ఎస్(BRS) హయాంలో ప్రభుత్వం పేద ప్రజల ఆరోగ్యం కోసం ప్రత్యేక ప్రణాళికలతో ముందుకు సాగిందని అన్నారు. శిథిలావస్థకు చేరిన దవఖానల స్థానంలో కొత్త వాటిని నిర్మించిందని పేర్కొన్నారు. ప్రైవేటు ఆస్పత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు కల్పించిందని వెల్లడించారు. అందుబాటులో బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేసిందని అన్నారు.
అవసరమైన మందులను అందించిందని వివరించారు. నిర్మాణపనులల్లో నాణ్యతాలోపాలు జరుగకుండా అధికారులు పనులను పరిశీలించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ డీఈ వేణుగోపాల్, ఏఈ శ్రీను, తదితరులు పాల్గొన్నారు.