ఖైరతాబాద్, అక్టోబర్ 20 : ‘కర్నాటక, మహారాష్ట్ర తదితర రాష్ర్టాల్లో నేటికీ పవర్ కట్ కొనసాగుతున్నా.. దేశంలోనే ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో గత పదేండ్లుగా 24 గంటల విద్యుత్ను అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. సోమాజిగూడలోని జయా గార్డెన్స్లో ముఖ్యకార్యకర్తల సమావేశం కార్పొరేటర్, జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యురాలు వనం సంగీతయాదవ్ ఆధ్వర్యంలో జరిగింది. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే దానం నాగేందర్ హాజరై మాట్లాడారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇక్కడి ప్రజల ఆకాంక్ష నెరవేర్చమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేసిందన్నారు. ఎన్నికల ప్రక్రియ తర్వాత ప్రతి ఒక్కరికీ సీఎం కేసీఆర్ హెల్త్ కార్డుతో చికిత్సల కోసం రూ.15లక్షలు కేటాయిస్తారని, దేశంలో ఏ కార్పొరేట్ ఆస్పత్రికి వెళ్లినా ఉచితంగా ట్రీట్మెంట్ తీసుకోవచ్చన్నారు. రూ.400లకే గ్యాస్ సింలిండర్, సౌభాగ్యలక్ష్మి పేరుతో ప్రతి ఆడపడుచుకు ఆర్థిక స్వావలంబన, మార్చి నెలలో అర్హులైన వారందరికీ తెల్ల రేషన్ కార్డులు అందజేస్తారన్నారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్ పర్సన్ కె.ప్రసన్న, బీఆర్ఎస్ సోమాజిగూడ డివిజన్ అధ్యక్షుడు ఎస్కే అహ్మద్, ప్రధాన కార్యదర్శి పి.నాగరాజు, మాజీ కార్పొరేటర్ లక్ష్మీనారాయణమ్మ, నాయకులు వనం శ్రీనివాస్ యాదవ్, ఉత్తమ్, జగన్ తదితరులు పాల్గొన్నారు.