మేడ్చల్, జూన్ 7: తెలంగాణలో సాగుకు ప్రధానమైన చెరువులను మిషన్ కాకతీయ పథకం కిం ద అభివృద్ధి చేశారు.కట్టవెడల్పు చేయడం, పూడిక తీయ డం,తూముల మరమ్మతు తదితర పనులను చేపట్టారు.దీంతో భూగర్బ జలాలు గణనీయంగా పెరిగాయి. సాగు విస్తీర్ణం పెరిగింది. మిష న్ కాకతీయ నిధులతో చెరువులను సుందరీకరించారు.ఇందులో భాగంగా మేడ్చల్ మం డలం గుండ్లపోచంపల్లి నారాయణ చెరువును రూ.80 లక్షలతో అభివృద్ధి చేశారు. ఉదయం, సాయం త్రం వేళ్లలో ఆహ్లాదంగా గడిపేందుకు ఏర్పాట్లు చేశారు.చెరువుకు గ్రిల్ ఏర్పాటు చేశారు.ఫుట్పాత్ను నిర్మించారు. లైటింగ్ను ఏర్పాటు చేశా రు.మూడుచింతపల్లి మండలం అద్రాస్పల్లిలో కేశవరం గ్రామానికి సమీపంలో ఆనకట్ట మరమ్మతు చేశారు. దాదాపు 400 ఏండ్ల క్రితం ఇక్కడ ఆనకట్ట ఉంది.
కట్ట కింద భాగంలో బుంగపడి నీరు లీకేజీ అవుతుండటంతో మిషన్ కాకతీయలో భాగంగా రూ. 14లక్షలతో ఆనకట్టను మరమ్మతు చేశారు. వేసవికాలంలోనూ నిండుకుండను తలపిస్తుంది. శామీర్పేటలో ఉన్న పెద్ద చెరువు మండలంలోని 7 గ్రామాల్లోని వందలాది ఎకరాలకు సాగునీటిని అందిస్తోంది. ఈ చెరువును పర్యాటక అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక నిధులతో మం జూరు చేసింది. రూ.25 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించారు. ఇప్పటికే పర్యాటకులు ఆహ్లాదరకంగా గడిపి వెళ్లేందుకు వివిధ అభివృద్ధి పనులు చేపట్టారు.