హైదరాబాద్ : రవీంద్ర భారతి సమీపంలో ఓ బ్యాగు పడిపోయింది. ఆ బ్యాగును ఓ ఆటో డ్రైవర్ తీసుకునేందుకు యత్నించాడు. ఈ విషయాన్ని డీజీపీ ఆఫీసు వద్ద విధుల్లో ఉన్న పోలీసులు గమనించారు. పోలీసులు ఆ బ్యాగును స్వాధీనం చేసుకుని సైఫాబాద్ పోలీసులకు అప్పగించారు. బ్యాగు తెరిచి చూడగా, అందులో రూ. 10,050 నగదు, 3.8 తులాల బంగారు ఆభరణాలు కనిపించాయి. బ్యాగులో ఉన్న ఆధార్ కార్డు ఆధారంగా బాధితురాలిని కూకట్పల్లికి చెందిన పద్మ కుమారిగా పోలీసులు గుర్తించారు. అనంతరం ఆమెకు సమాచారం అందించడంతో.. సైఫాబాద్ పోలీసు స్టేషన్కు వచ్చి బ్యాగును తీసుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులకు పద్మకుమారి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.