వివిధ ప్రాంతాల్లో మాదకద్రవ్యాలు స్వాధీనం
నిందితుల అరెస్టు
ఖైరతాబాద్, మే 25 : హాష్ ఆయిల్ను విక్రయిస్తున్న ఇద్దరితో పాటు దానిని కొనుగోలు చేసి వినియోగిస్తున్న వారిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… జూబ్లీహిల్స్ రోడ్ నం.38లో హాష్ ఆయిల్ విక్రయిస్తున్నారన్న పక్కా సమాచారంతో హైదరాబాద్ నారోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ అధికారులు, జూబ్లీహిల్స్ పోలీసులు సంయుక్తంగా మెరుపుదాడి చేసి.. బాలానగర్ వినాయక్నగర్కు చెందిన షేక్ బిలాల్ (28), అదే ప్రాంతానికి చెందిన పుచ్చకాయల వెంకట పవన్ కుమార్ (26)లను పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 90 గ్రాముల హాష్ ఆయిల్ను స్వాధీనం చేసుకున్నారు. వారిచ్చిన సమాచారంతో హాష్ ఆయిల్ ఉపయోగిస్తున్న అనుపతి భరత్రెడ్డి (22), రూపేశ్ ప్రతాప్ సింగ్ (35), ఆర్నబ్ సేన్ (40), సౌరవ్ సేన్ (40)లను సైతం అరెస్టు చేశారు. నిందితులపై ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు.
డ్రగ్స్ విక్రయిస్తుంటే..
హిమాయత్నగర్, మే 25: డ్రగ్స్ విక్రయిస్తున్న ఇద్దరు యువకులను నారాయణగూడ పోలీసులు అరెస్ట్ చేశారు.సీఐ గట్టుమల్లు తెలిపిన వివరాల ప్రకారం సోమాజిగూడలో ఉండే మేక అఖిల్(22), దోమల్గూడలో ఉండే రోహిత్రెడ్డి ఇద్దరు కలిసి గోవా నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి విక్రయస్తున్నారు. హిమాయత్నగర్లో వీరిని అరెస్టు చేసిన పోలీసులు.. 2.5 గ్రాముల డ్రగ్స్, రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
కేసు నమోదు..
మేడ్చల్ రూరల్, మే 25 : గంజాయి విక్రయదారులపై ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులు కేసు నమోదు చేశారు. కండ్లకోయలో నివాసముంటున్న అనురాగ్ చౌహాన్ వద్ద 40 గ్రాములు ఎండు గంజాయి లభించింది. అతడు ఇచ్చిన సమాచారంతో జీడిమెట్లలో ఉంటున్న మహిళ వద్ద 110 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.