హసన్పర్తి, ఏప్రిల్ 10 : విలీన గ్రామాల్లో పట్టణ వాతావరణం తీసుకొచ్చేలా కృషి చేస్తామని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. గ్రేటర్ పరిధిలోని 55, 56 డివిజన్లలో రూ.5 కోట్లతో, ఎల్లాపూర్లో రూ. 2.40కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శనివారం ఎమ్మెల్యే అరూరి రమేశ్ శంకుస్థాపన చేశారు. అనంతరం సీసీరోడ్లు ప్రారంభించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ హసన్పర్తి, ఎల్లాపూర్ విలీన గ్రామాల్లో గ్రేటర్ నిధులతో అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షులు పాపిశెట్టి శ్రీధర్, గడ్డం శివరాంప్రసాద్, పీఏసీఎస్ చైర్మన్ బిల్లా ఉదయ్రెడ్డి, రైతు బంధు సమితి మండల కోఆర్డినేటర్ అంచూరి విజయ్కుమార్, ప్రధాన కార్యదర్శులు పెద్దమ్మ శ్రీనివాస్, ఏరుకొండ శ్రీనివాస్, మార్కెట్ డైరెక్టర్ చకిలం రాజేశ్వర్రావు, కందుకూరి చంద్రమోహన్, పిట్టల కుమారస్వామి, ఎర్రగట్టుగుట్ట ఆలయ చైర్మన్ సదానందం, శ్రీకాంత్, డీకొండ భిక్షపతి, దోమల శ్రీనివాస్, శంకర్, పాడి మల్లారెడ్డి, రామకృష్ణ, దుర్గాప్రసాద్, సాగర్, మురళి పాల్గొన్నారు.
భట్టుపల్లిలో..
మడికొండ : గ్రేటర్ 33వ డివిజన్ భట్టుపల్లిలో రూ.5కోట్ల అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే అరూరి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయనకు మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. అంతకుముం దు ఎమ్మెల్యేను సత్కరించారు. ఆయన వెంట టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఇండ్ల నాగేశ్వర్రావు ఉన్నారు.
ఎమ్మెల్యేను కలిసిన టీఎన్జీవోస్ కార్యవర్గం
హన్మకొండ : ఎమ్మెల్యే అరూరి రమేశ్ను హన్మకొండలోని ఆయన నివాసంలో టీఎన్జీవోస్ వరంగల్ అర్బన్ జిల్లా నూతన కార్యవర్గ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా అధ్యక్షుడు ఆకుల రాజేందర్, కార్యదర్శి బైరి సోమయ్య, అసోసియేట్ అధ్యక్షుడు పుల్లూరి వేణుగోపాల్, కోశాధికారి పీ రాజేశ్, రాష్ట్ర నాయకులు శ్యాంసుందర్, కత్తి రమేశ్, జిల్లా నాయకులు సలీం, మోయిజ్, కుమార్, సురేశ్, రవి, ప్రసాద్, రాజేశ్ఖన్నా, లక్ష్మీప్రసాద్, కృష్ణ ఉన్నారు.