గోల్నాక (హైదరాబాద్) : వ్యక్తి గత శుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ (MLA Kaleru Venkatesh) అధికారులకు సూచించారు. శనివారం అంబర్ పేట మున్సిపల్ మైదానంలో సర్కిల్ డీఎంసీ మారుతీ దివాకర్ అధ్యక్షతన నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షణ్(Swachh Sarvekshan) కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు.
నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలతో పాటు రహదారులపై వ్యర్థాలు పేరుకు పోకుండా ఎప్పటికప్పడు శుభ్రం చేస్తూనే ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. స్వచ్ఛ అంబర్ పేట నియోజకవర్గమే లక్ష్యంగా పని చేయాలని ఆయన పారిశుద్ధ్య విభాగం అధికారులను ఆదేశించారు.
అంతకుముందు అంబర్పేట మండల తహసీల్దార్ కార్యాలయంలో 116 మందికి కల్యాణ లక్ష్మి (Kalyana laxmi) , షాదీ ముబారక్(Shadi Mubarak) చెక్కులను అందజేశారు. ప్రభుత్వ పథకాలను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు దూసరి లావణ్య శ్రీనివాస్గౌడ్, విజయ్కుమార్గౌడ్, బి.పద్మావెంకట్రెడ్డి, ఉమారమేశ్యాదవ్ తదితరులు పాల్గొన్నారు.