మేడ్చల్, నవంబరు 28: బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి, సంక్షేమానికే మేడ్చల్ ప్రజలు జై కొడుతున్నారు. వివిధ పార్టీలకు చెందిన నేతలు, యువకులు, కుల సంఘాల నుంచి లభిస్తున్న మద్దతు ఇందుకు నిదర్శనంగా కన్పిస్తోంది. అభ్యర్థుల ఎంపిక నుంచే కాంగ్రెస్, బీజేపీల్లో అనైక్యతత వెలుగు చూసింది. అన్ని పార్టీల కంటే ముందు బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటిస్తే కాంగ్రెస్, బీజేపీలు అభ్యర్థుల ఎంపికలో వెనుకబడ్డాయి. కుమ్ములాటలతో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వరకు కూడా ఖరారు కాని పరిస్థితి ఏర్పడింది. ఆ తర్వాత ప్రచారం నిర్వహించినా అంతం త మాత్రంగానే స్పందన వచ్చింది.
కలిసొచ్చిన అభ్యర్థుల ఎంపిక
రాష్ట్రంలో ఉన్న అతి పెద్ద నియోజకవర్గాల్లో మేడ్చల్ ఒకటి. దాదాపు 6లక్షల మంది ఓటర్లు ఉన్నారు. మేడ్చల్, శామీర్పేట, మూడుచింతపల్లి, ఘట్కేసర్, కీసర మండలాలతో పాటు 7 మున్సిపాలిటీలు, మూడు కార్పొరేషన్లు ఉన్నాయి. బీఆర్ఎస్ ప్రకటించిన అభ్యర్థుల మొద టి జాబితాలోనే మంత్రి మల్లారెడ్డికి చోటు లభించింది. అంతకు ముందు మల్లారెడ్డి ప్రజల్లో ముందున్నారు. ఆత్మీయ సమ్మేళనాలతో పార్టీకి దూరంగా ఉన్న వారిని ఏకతాటిపైకి తీసుకువచ్చారు. ఆ తర్వాత రోజు రోజుకు ప్రచార జోరుగా పెంచారు. తొమ్మిదిన్నరేండ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి, తాను ప్రజా సంక్షేమానికి, అభివృద్ధికి తీసుకున్న చర్యలు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.
భారీ స్పందన
మంత్రి మల్లారెడ్డి పక్కా ప్రణాళిక ప్రకారం ప్రత్యర్థులను ఊపిరి సలపనివ్వకుండా ప్రచారం నిర్వహించారు. సీఎం కేసీఆర్ సభ అనంతరం ప్రచారంలో మరింత దూకుడు పెంచారు. ఉదయం, రాత్రి వరకు ప్రచారం నిర్వహించారు. ఆశీర్వాద సభలు, కార్నర్మీంటింగ్లు, ఆత్మీయ సమ్మేళనాలు, చేరిక కార్యక్రమాల్లో హోరెత్తించారు. మేడ్చల్, దమ్మాయిగూడ, జవహర్నగర్, బోడుప్పల్, పీర్జాదిగూడ, గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలతో పాటు వివిధ గ్రామాల్లో నిర్వహించిన కార్యక్రమాలకు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో పాటు ప్రజలు తండోతండాలుగా తరలివచ్చారు.
మంగళహారులతో స్వా గతం పలికారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న వచ్చిన మార్పులు, 24 గంటల కరెంట్, ఇంటింటికి నీళ్లు, ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, రైతుబంధు, రైతుబీమా, దళిత బంధు లాంటి పథకాలతో నియోజకవర్గంలో మున్సిపాలిటీలు, గ్రామాల్లో చేసిన అభివృద్ధిని వివరిస్తూ ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్, బీజేపీల వైఫల్యాలను, అధికారంలో ఉన్నప్పుడు పనిచేసిన తీరు, ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీలు అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో అమలవుతున్న సంక్షేమపథకాల విమర్మనాస్ర్తాలను సంధించారు.
ఏకగ్రీవంగా మద్దతు
బీఆర్ఎస్కు పలు కుల సంఘాలు, కాలనీలు ఏకంగా మద్దతిచ్చాయి. నాగారం మున్సిపాలిటీకి చెందిన 3వ వార్డుకు చెందిన వివిధ కాలనీల ప్రజలు ఏకగ్రీవంగా మంత్రి మల్లారెడ్డికి మద్దతు ఇస్తున్న ప్రకటించారు. ఆ తర్వాత మేడ్చల్ మండలం నూతన్కల్ గ్రామానికి ముదిరాజ్, గౌడవెల్లికి చెందిన కుర్మ కులస్తులు, జవహర్నగర్ 28వ డివిజన్ కాలనీలు ప్రజలు, బోడుప్పల్ కురమ సం ఘం ఇలా ఎన్నో కుల సంఘాలు, కాలనీలు మద్దతు తెలిపాయి. దీని తోడు పథకాల లబ్ధిదారులు, అభివృద్ధిని కాంక్షించే వారు, రైతుల సంపూర్ణ మద్దతు బీఆర్ఎస్కే ఉన్నందున బీఆర్ఎస్ విజయం నల్లేరు మీద నడకే అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ద్విముఖ పోటీ..
మేడ్చల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్తో పాటు కాం గ్రెస్, బీజేపీలు పోటీ పడుతున్నప్పటికీ ద్విముఖ పోటీ ఉంది. కాంగ్రెస్లో మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్రెడ్డి, జడ్పీ చైర్మన్ శరత్చంద్రారెడ్డి, నక్క ప్రభాకర్గౌడ్ తదితర నేతలు కాంగ్రెస్లో చేరినప్పటికీ వారితో పాటు క్యాడర్ మాత్రం వెళ్లలేదు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి జవహర్నగర్, మేడ్చల్లో నిర్వహించిన కార్నర్ మీటింగ్లకు కూడా పెద్ద స్పందన కన్పించలేదు. ఎమ్మెల్యే అభ్యర్థి తోటకూర జంగయ్య యాదవ్ ప్రచారానికి జనం అంతంత మాత్రంగానే కన్పించారు. నియోజకవర్గ వ్యాప్తంగా చివరి వరకు ఇదే పరిస్థితి ఉంది. కాంగ్రెస్ ఊపు వచ్చిదంని ఆ పార్టీల నాయకులు ప్రజల్లో ప్రచారం చేసుకున్నప్పటికీ జనాల్లో మాత్రం ఆ స్పందన కన్పించ లేదు.