TSRTC | నగరంలో సరిపడా బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు అవస్థలుపడుతున్నారు. ప్రయాణికుల సంఖ్య రోజురోజుకు రెట్టింపవుతున్నా.. ఇందుకు అవసరమైన సర్వీసులు నడపడంలో ఆర్టీసీ వెనుకబడుతున్నది. దీనికి తోడు మేడరం జాతర కోసం కొన్ని బస్సులను అటువైపు మళ్లించడంతో నగరవాసుల కష్టాలు మరింత పెరిగాయి. ఉద్యోగులు, విద్యార్థులు, ఇతర పనుల కోసం వెళ్లేవారు బస్సుల కోసం గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తున్నది.