స్వచ్ఛగ్రామాలుగా తెలంగాణ పల్లెలు
గ్రామాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ పెద్దపీట
మంత్రి సబితా ఇంద్రారెడ్డి
కందుకూరు/మహేశ్వరం/పహాడీషరీఫ్, జూన్ 6 : అద్భుత ఫలితాలిస్తున్న పల్లె ప్రగతి కార్యక్రమం దేశానికి ఆదర్శంగా నిలిచిందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. సోమవారం మండల పరిధిలోని సాయిరెడ్డిగూడ గ్రామంలో టీఐసీసీ మంజూరు చేసిన రూ.70లక్షలతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. పల్లెలు, పట్టణాలు పరిశుభ్రతతో కళకళలాడుతున్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రం ప్రగతి దిశగా పయనిస్తుందని తెలిపారు. గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నట్లు చెప్పారు. ఒకప్పుడు చెత్త కుప్పలు, మురుగునీటితో గ్రామాలు కంపు కొడుతే.. నేడు పల్లెల్లో ప్రగతితో పచ్చని చెట్లు, పరిశుభ్రతకు అనవాళ్లుగా మారి ప్రజలకు ఆహ్లాదాన్ని పంచుతుందన్నారు. ప్రతి ఊరుకో క్రీడా ప్రాంగణం ఏర్పాటు గొప్పవిషయమన్నారు. దీంతో గ్రామీణ క్రీడాకారులకు ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు. పల్లె ప్రగతిలో నెలకు రూ.9.8కోట్లను విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఫార్మాసిటీలో భూములు కోల్పోయిన రైతులకు ఇంటికో ఉద్యోగం ఇంటి స్థలం ఇస్తున్నట్లు తెలిపారు. బాధితుల సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకవెళ్లి పరిష్కారిస్తానని చెప్పారు.
పల్లె ప్రగతిని విజయవంతం చేయాలి
పల్లె ప్రగతిని విజయవంతం చేయాలని జడ్పీ చైర్పర్సన్ తీగల అనితా హరినాథ్రెడ్డి అన్నారు. సోమవారం మండల పరిధిలోని గొల్లూరులో జరుగుతున్న పల్లె ప్రకృతి పనులను ఎంపీపీ రఘుమారెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పల్లె ప్రగతిలో భాగంగా రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ సునీతా ఆంధ్యానాయక్ టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ఆంగోత్ రాజూనాయక్ గొల్లూరు సర్పంచ్ మంద కవిత కుమార్, ఎంపీటీసీ రమేశ్, రామచంద్రగూడ సర్పంచ్ శివిరాజూనాయక్ ఎంపీడీవో నర్సింహులు పాల్గొన్నారు.
స్వచ్ఛ మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలి..
తుక్కుగూడను స్వచ్ఛ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుదామని కమిషనర్ జ్ఞానేశ్వర్ అన్నారు. పట్టణ ప్రగతిలో భాగంగా 13వ డివిజన్ కౌన్సిలర్ సప్పిడి లావణ్యరాజు ముదిరాజ్తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్టణ ప్రగతిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఈ బార్గవ్రెడ్డి, స్థానికులు పాల్గొన్నారు.
పట్టణ ప్రగతితో వార్డులో మార్పులు
సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పట్టణ ప్రగతి ద్వారా వార్డుల్లో పెనుమార్పులు జరుగుతున్నాయని 21వ వార్డు కౌన్సిలర్ షేక్ అఫ్జల్ అన్నారు. సోమవారం వాది ఏ ముస్తఫా కాలనీలో పట్టణ ప్రగతి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రగతి వార్డు ఇన్చార్జి రతన్, వర్క్ ఇన్స్పెక్టర్ అరుణ్, సూపర్వైజర్ కుమార్, కాలనీ వాసులు పాల్గొన్నారు.
రేపు మంత్రుల రాక..
రేపు పల్లె ప్రగతిలో భాగంగా వివిధ అభివృద్ధి పనుల ప్రారంభానికి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, జడ్పీ చైర్పర్సన్ తీగల అనితా హరినాథ్రెడ్డి రానున్నారని టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ఆంగోత్ రాజూనాయక్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గొల్లూరు, అమీర్పేట్, మన్సాన్పల్లి గ్రామాల్లో జరిగే పల్లె ప్రగతి అభివృద్ధి పనులను వారు ప్రారంభిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమానికి వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు వివిధ శాఖల అధికారులు సకాలంలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన ఒక ప్రకటనలో కోరారు.
బడి బాటకు విశేష స్పందన..
మన ఊరు-మన బడి కార్యక్రమం ద్వారా రూ.7,300కోట్లతో 26వేల ప్రభుత్వ పాఠశాలల్లో 12రకాల సదుపాయాలను కల్పిస్తున్నట్లు ఆమె తెలిపారు. మండలంలో రూ.3కోట్లతో ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఎలాంటి ఫీజులు ఉండవని, పుస్తకాలు, యూనిఫాంలను ఉచితంగా ఇస్తున్నట్లు చెప్పారు. సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం పెడుతున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తునన బడి బాట కార్యక్రమానికి విశేష స్పందని వస్తుందని చెప్పారు.
కార్యక్రమంలో ఎంపీపీ మంద జ్యోతి పాండు, వైస్ ఎంపీపీ గంగుల శమంత ప్రభాకర్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ సురుసాని వరలక్ష్మీ సురేందర్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ దేవరశెట్టి చంద్రశేఖర్రెడ్డి, ఎంపీటీసీ మండల మహిళా విభాగం అధ్యక్షుడు తాండ్ర ఇందిరమ్మ దేవేందర్, సర్పంచ్ మహేశ్, నాయకులు తాండ్ర దేవేందర్, గంగాపురం లక్ష్మీనర్సింహారెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు మన్నే జయేందర్ ముదిరాజ్, కంద పెద్ద నర్సింహ, కాకి దశరథ, ఆర్.ప్రభాకర్రెడ్డి, సురేందర్రెడ్డి, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు సురుసాని రాజశేఖర్రెడ్డి, సాయిలు, మండల కృష్ణ, రైతు విభాగం అధ్యక్షుడు సొలిపేట అమరేందర్రెడ్డి, యూత్ నాయకులు తాళ్ల కార్తిక్, కొలను విజ్ఞేశ్వర్రెడ్డి, గొర్రెంకల యాదయ్య, రామకృష్ణ, సోషల్ మీడియా కన్వీనర్ బొక్క దీక్షిత్రెడ్డి, వెంకటేశ్, తాసీల్దార్ ఎస్.జ్యోతి వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు అధికారులు టీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.