గోల్నాక : ఓవర్టేక్ చేయ బోయి బస్సు కిందపడి ఓ వ్యక్తి మృతి చెందిన విషాద ఘటన అంబర్పేట పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ పేరం సుధాకర్ తెలిపిన వివరాల ప్రకారం..అంబర్పేట పటేల్నగర్ ప్రాంతానికి చెందిన భానుప్రసాద్ (18) ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. కాగా, సోమవారం పనిమీద తన స్నేహితుడు భాస్కర్తో కలసి టీవీఎస్ బైక్ (TS08GC 6617)పై అంబర్పేట శివం రోడ్డు నుంచి ఛే నంబరు బయలు దేరారు.
ఈ క్రమంలో ఆదే రూట్లో వెళ్తున్న ఉప్పల్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు (AP 28Z5434)ను గోకుల్ స్వీట్ హౌజ్ ఎదురుగా బైక్ డ్రైవింగ్ చేస్తున్న భాస్కర్ ఓవర్ టేక్ చేసే క్రమంలో ప్రమాదవశాత్తు బైక్ వెనక కూర్చున్న భానుప్రసాద్ బస్సు వెనక టైర్ కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు.
అతని స్నేహితుడు భాస్కర్ స్వల్పగాయాలతో తృటిలో ప్రాణాలతో బయటపడ్డాడు. భానుప్రసాద్ మృతి వార్త విని పటేల్నగర్ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.