శంషాబాద్ రూరల్, ఆగస్టు 4: శంషాబాద్ ఎయిర్పోర్టులో అక్రమంగా 150 బాటిల్స్లో తరలిస్తున్న రూ.1.15 కోట్లు విలువైన ప్రొటీన్ పౌడర్, నిషేధిత సిగరెట్లు 2.82 లక్షలు పట్టుబడ్డాయి.
దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికులను కస్టమ్స్ అధికారులు వేర్వేరుగా తనిఖీ చేయగా ఇవి బయటపడ్డాయి. ప్రొటీన్ పౌడర్ తరలిస్తున్న 14 మందిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు.