ఎల్బీనగర్, ఆగస్టు 19 : దానాల్లో కెల్లా అవయవ దానం అత్యున్నతమైనదని, ప్రతిఒక్కరూ అవయవదానానికి ముందుకు రావాలని తెలంగాణ నేత్ర శరీర అవయవ ధాతల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జాతీయ అవార్డు గ్రహీత డాక్టర్ పరికిపండ్ల అశోక్ కోరారు. గురువారం ఎల్బీనగర్లోని మజీద్ గల్లీలో చేనేత కార్మిక సంఘం నాయకుడు చెరుకు స్వామి ఆధ్యర్యంలో ప్రపంచ అవయవదాన వారోత్సవాలు జరిగాయి.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ అశోక్ హాజరై మాట్లాడుతూ..చనిపోయిన తర్వాత అవయవాలను కాల్చడం ద్వారా బూడిద పాలు, మట్టిలో పాతడం ద్వారా మట్టిపాలు చేయకుండా అవయవ దానం చేసి చిరంజీవులుగా మిగిలిపోవాలని సూచించారు. వారివారి ప్రాంతాల్లో అవయవ దానంపై కార్యక్రమాలను ఉధృతం చేయాలని కోరారు.
కార్యక్రమంలో పొట్టబత్తిని రమేష్, చల్ల చంద్రమౌళి, ఏర్వ నర్సింహా, దుస్స కుమార్, సంగేపు నరేందర్, రాపోలు భిక్షమయ్య, అనిత, బొమ్మ అరేందర్, తదితరులు పాల్గొన్నారు.