శేరి లింగంపల్లి, జనవరి 3: బ్రిటిష్ ఆటోమోబైల్ బ్రాండ్ ‘వన్ మోటో’ సంస్థ ఎలక్ట్రికల్ బైక్లు హైదరాబాద్ నగరంలో అందుబాటులో రానున్నాయి. ఫిబ్రవరిలో నగరంలో నూతన షొరూంను ప్రారంభించి అమ్మకాలు కొనసాగిస్తామని ఆ సంస్థ ప్రకటించింది. ఈ మేరకు నగరంలోని గచ్చిబౌలి లా మెరీడియన్ హోటల్లో జరిగిన ఓ కార్యక్రమంలో వన్మోటో సంస్థకు చెందిన మూడు నూత న ఈ-బైక్ మోడళ్లను తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వన్మోటో సంస్థ సహ వ్యవస్ధాపకులు, ఎండీ ముజామిల్ రియాజ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో వన్మోటో ఎలక్ట్రిక్ బైకులు ఫిబ్రవరి మొదటి వారంలో అందుబాటులోకి వస్తాయన్నారు. ఆకర్షణీయమైన అధునాతన ప్రీమియం మోడళ్లతో నాణ్యమైన ఈ-బైక్లు అందిస్తామన్నారు. నగరంలో మొదటి షోరూమ్ను ప్రారంభించి, తమ సేవలు కొనసాగిస్తామన్నారు. తమ సంస్థకు చెందిన మూడు ప్రీమియం బైక్ మోడళ్లు “బైకా, ఎలెక్టా, కమ్ముట”లను ఆవిష్కరించడం జరిగిందని తెలిపా రు. పెట్టుబడులకు తెలంగాణ రాష్ట్రం ఎంతో అనువైనదని, వన్మోటో సం స్థ కార్యకలాపాలు ప్రారంభించడంతో తెలంగాణ ప్రభుత్వ ప్రోత్సాహం మరువలేనిదన్నారు. త్వరలో తెలంగాణ ప్రభుత్వం, వన్మోటోల మధ్య పరస్పర అవగాహన ఒప్పందం జరుగనుందని, జహీరాబాద్లోని పారిశ్రామిక పార్క్లో 250 కోట్ల వ్యయంతో వన్మోటో పరిశ్రమ తయారీ ప్లాంట్ను ఏర్పాటుచేయడం జరుగుతుందన్నారు. ఈ మేరకు పరిశ్రమ ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని తెలంగాణ ప్రభుత్వం అందించేందుకు సిద్ధంగా ఉందన్నారు. తద్వారా ప్రత్యక్షంగా 500 మందికి, పరోక్షంగా 2000 మందికి ఉపాధి లభించనుందని ఆయన పేర్కొన్నారు. వన్మోటో సహ వ్యవస్ధాపకులు సమీర్ మోదిన్, వన్మోటో ఇండియా సీఈవో శుభాంకర్ చౌదరితో పాటు పలువురు ప్రముఖులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
రేస్ ఎనర్జీ బ్యాటరీ స్వాప్ స్టేషన్..
నగరంలో రేస్ ఎనర్జీ సంస్థ, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్తో కలిసి మొట్ట మొదటిసారిగా ఏర్పాటు చేసిన బ్యాటరీ స్వాప్ స్టేషన్ను ప్రారంభిస్తున్న రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ జయేష్ రంజన్