బంజారాహిల్స్ : పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి నివాసం వద్ద ఆందోళన చేసేందుకు వచ్చిన టీఆర్ఎస్వీ కార్యకర్తలమీద కర్రలతో దాడి చేసిన ఘటనలో నిందితులపై జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్లో కేసు నమోదయింది. మంగళవారం జూబ్లీహిల్స్లోని రేవంత్ రెడ్డి ఇంటివద్ద దాడి సంఘటనలో సుమారు 40మందికి పైగా పాలుపంచుకున్నట్లు టీఆర్ఎస్వీ నేత కటారి స్వామియాదవ్ ఇచ్చిన ఫిర్యాదుతో నారికేల నరేష్, రవీంద్రనాయక్, వన్నీరు గణేష్ తదితరులపై ఐపీసీ 324,147, 149 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
ఘటనలో నిందితుడైన నారికేల నరేష్ను బుధవారం అరెస్ట్ చేసిన పోలీసుల మిగిలిన వారి కోసం గాలింపు చేపట్టారు. ఇదిలా ఉండగా రేవంత్రెడ్డి ఇంటివద్దకు వచ్చి దాడికి పాల్పడ్డారంటూ కాంగ్రెస్ కార్యకర్తలు ఇచ్చిన ఫిర్యాదుతో టీఆర్ఎస్వీ నేతలపై కూడా జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.