సిటీబ్యూరో, మార్చి 21 (నమస్తే తెలంగాణ) : గ్రేటర్లో కంటివెలుగు 42వ రోజు 274 కేంద్రాల్లో 28,119 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. అందులో 3,422 మందికి రీడింగ్ గ్లాసెస్ను పంపిణీ చేయగా 2,298 మందికి ప్రిస్క్రిప్షనరీ గ్లాసెస్ కోసం సిఫారసు చేసినట్లు అధికారులు వెల్లడించారు.
హైదరాబాద్ జిల్లాలో….
నగరంలో 115 కేంద్రాల్లో 9,398 మందికి కంటి పరీక్షలు నిర్వహించి 1,450 మందికి రీడింగ్ గ్లాసెస్, 965 మంది రోగులకు ప్రిస్క్రిప్షనరీ గ్లాసెస్ను సిఫారసు చేసినట్లు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటి తెలిపారు.
మేడ్చల్ జిల్లా పరిధిలో…
జిల్లా పరిధిలో 79కేంద్రాల ద్వారా 9,426 మందికి కంటి పరీక్షలు నిర్వహించి 1,059 మందికి రీడింగ్ గ్లాసెస్ పంపిణీ చేశామని, 545 మందికి ప్రిస్క్రిప్షనరీ గ్లాసెస్ను సిఫారసు చేశామని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్ వెల్లడించారు.
రంగారెడ్డి జిల్లా పరిధిలో…
జిల్లా పరిధిలో 80కేంద్రాల ద్వారా 9,295 మందికి కంటి పరీక్షలు నిర్వహించి 913 మందికి రీడింగ్ గ్లాసెస్ పంపిణీ చేయగా, 788 మందికి ప్రిస్క్రిప్షనరీ గ్లాసెస్ను సిఫారసు చేశామని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు.