సిటీబ్యూరో, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ): వివిధ దేశాల నుంచి వచ్చిన ప్రవాస తెలంగాణ సంస్థల ప్రతినిధులు ఇన్నోవేషన్ కేంద్రాలైన టీ హబ్, టీ వర్క్స్ను శనివారం సందర్శించారు. రాష్ట్ర చలన చిత్ర, టీవీ, థియేటర్స్ డెవలప్మెంట్ కార్పొరేష న్ చైర్మన్ అనిల్ కుర్మాచలంతో కలిసి ఎన్నారై బీఆర్ఎస్, తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్ డమ్ (టాక్), ఆస్ట్రేలియా తెలంగాణ అసోసియేషన్ (అటై) నాయకులు, ప్రతినిధులంతా కలిసి టీ హబ్, టీ వర్స్ కేంద్రాల్లో కలియ తిరిగి అక్కడి వివరాలను తెలుసుకున్నారు. వినూత్న ఆవిషరణలతో వచ్చిన స్టార్టప్ సంస్థలను ప్రోత్సహించేందుకు ఏర్పాటైన టీ-హబ్, టీ వర్స్ కేంద్రాలు దేశానికే గర్వకారణమని, సీఎం కేసీఆర్ ,మంత్రి కేటీఆర్ల విజన్ ఎంతో అద్భుతమని ఎన్ఆర్ఐలు ప్రశంసించారు.
దేశంలో ఆంత్రప్రెన్యూర్ షిప్ (వ్యవస్థాపకత), ఇన్నోవేషన్ ను ప్రోత్సహించడమే లక్షంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీ హబ్, టీ వర్స్ కేంద్రాలతో మంచి ఫలితాలు వస్తున్నాయని టీ హబ్ ప్రతినిధులు ఎన్ఆర్ఐ బృందాలకు వివరించారు. హైదరాబాద్ నగరం ఐటీ రంగంలో అద్భుతమైన ప్రగతిని సాధించిందని, ఈ మార్పుకి ఐటీ ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఎంతో చొరవ తీసుకున్నారని పేర్కొన్నారు. స్టార్టప్లకుకు రాష్ట్ర ప్రభుత్వం విశేష ప్రోత్సాహం అందిస్తుందని, దీనిని యువత సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఎన్నారై బీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అద్భుతమైన ఆలోచనలకు ఊతం ఇచ్చేలా టీ-హబ్, టీ-వర్స్ ఏర్పాటు చేయడం గొప్ప విషయమని అన్నారు. స్టార్టప్లు సాఫీగా తమ కార్యకలాపాలను నిర్వహించేందుకు అనుకూల వాతావరణం టీ-హబ్లో ఉందన్నారు. ఈ కార్యక్రమంలో అరవింద్ రెడ్డి, హరిగౌడ్ నవపేట్, సుప్రజ పులుసు, జాహ్నవి దూసరి, రవి ప్రదీప్ పులుసు, జెల్లా శ్రీకాంత్, అనిల్ బైరెడ్డి, మార్తినేని గూడెం సర్పంచ్ రాము బండమీది, తిరుమందాస్ నరేశ్, రాజేశ్ శమకురా, రాజు గౌడ్, వినయ్ గౌడ్ బత్తిని పాల్గొన్నారు.