హైదరాబాద్ : ఈ నెల 3వ తేదీన హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో నీటి సరఫరా బంద్ చేస్తున్నట్లు హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లయి, సీవరేజ్ బోర్డు ప్రకటించింది. శుక్రవారం మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 8 గంటల వరకు నీటి సరఫరా బంద్ చేస్తున్నట్లు తెలిపింది. షాహెబ్ నగర్ నుంచి మారేడ్పల్లి వరకు ఏర్పాటు చేసిన కృష్ణా పైపు లైన్ లాలాపేట్ రైల్వే క్వార్టర్స్ సమీపంలో దెబ్బతింది. దీంతో 450 ఎంఎం డయామీటర్ వాల్వ్ మార్చేందుకు నీటి సరఫరాను అత్యవసరంగా నిలిపివేస్తున్నట్లు స్పష్టం చేశారు.
ఈ పనుల వల్ల బాలాపూర్, మైసారం, బార్కస్, మేకలమండి, భోలక్పూర్, తార్నాక, లాలాపేట్, బౌద్ధనగర్, మారేడ్పల్లి, కంట్రోల్ రూమ్, రైల్వేస్, కంటోన్మెంట్, ప్రకాశ్నగర్, పాటిగడ్డ, హస్మత్పేట్, ఫిరోజ్గూడ, గౌతంనగర్, వైశాలినగర్, బీఎన్ రెడ్డి నగర్, వనస్థలిపురం, ఆటో నగర్, మారుతి నగర్, మహీంద్రా హిల్స్, ఏలుగుట్ట, రామాంతపూర్, ఉప్పల్, నాచారం, హబ్సిగూడ, చిలుకానగర్, బీరప్పగడ్డ, మీర్పేట్, లెనిన్ నగర్, బడంగ్పేట్ ఏరియాల్లో నీటి సరఫరాను నిలిపివేయనున్నారు.