దుండిగల్, ఆగస్టు 1 : దుండిగల్ మున్సిపాలిటీ పరిధి, 27వ వార్డులోని దుండిగల్ తండా-2లో మోల్డ్టెక్ సంస్థ సీఎస్ఆర్ నిధులతో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల భవనాన్ని సోమవారం ఎమ్మెల్యే వివేకానంద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు శంభీపూర్రాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా హెటిరో సంస్థ ఆధ్వర్యంలో 100 మంది విద్యార్థులకు స్కూల్ బ్యాగ్లు, కౌన్సిలర్ జక్కుల కృష్ణ సహకారంతో టీవీ, టీఆర్ఎస్ నాయకులు ప్రవీణ్ నాయక్ సౌజన్యంతో ఐడీ కార్డులు, ప్రేమ్సింగ్ ఆధ్వర్యంలో షూలను విద్యార్థులకు అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పాఠశాల భవనాన్ని మోల్డ్ టెక్ సంస్థ యాజమాన్యం పూర్తి చేయ డం అభినందనీ యమని, అదే విధంగా శ్రియాస్ లైఫ్ సైన్సెస్ సంస్థ ఫర్నిచర్ సమకూర్చడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఇతర దాతలు సైతం పాఠశాల అభివృద్ధిలో పాలు పంచుకోవడం సంతోషంగా ఉందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ పాఠ శాలల్లో ఇంగ్లిషు మీడియం విద్యతో పాటు మెరుగైన మౌలిక సదుపాయా లు కల్పిస్తున్నదన్నారు. కార్యక్రమంలో డీఈవో విజయకుమారి, ఎంఈవో ఆంజనేయులు, దుండిగల్ మున్సి పాలిటీ వైస్చైర్మన్ పద్మారావు, కౌన్సిలర్లు శంభీపూర్కృష్ణ, శంకర్నాయక్, అర్కల అనంతస్వామి, సాయియాదవ్, జగద్గిరిగుట్ట కార్పొరేటర్ జగన్, ఎంఎల్ఆర్ విద్యాసంస్థల చైర్మన్ మర్రి లక్ష్మణ్రెడ్డి, మాజీ జడ్పీ వైస్ చైర్మన్ బొంగునూరి ప్రభాకర్రెడ్డి, టీఆర్ఎస్ దుండిగల్ మున్సిపల్ అధ్యక్షుడు సంజీవరెడ్డి, సీఎస్ఆర్ ప్రొఫెషనల్ భీమ్సింగ్నాయక్, అడ్వైజర్ ప్రవీణ్తో పాటు మోల్డ్టెక్ సంస్థ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.