బడంగ్పేట, జనవరి 30 : బాలాపూర్ మండల పరిధిలోని ప్రభుత్వ భూముల కబ్జాపై ఎట్టకేలకు అధికారులు స్పందించారు. చర్యలు తీసుకోవడానికి రంగం సిద్ధం చేసినట్లు తెలిసింది. ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో ఇటీవల కుర్మల్గూడలో అక్రమ నిర్మాణాలు అనే శీర్షికన వరుస కథనాలు ప్రచురితం కావడంతో జిల్లా కలెక్టర్ శశాంక్ స్పందించారు. సోమవారం మహేశ్వరం డీసీపీ కార్యాలయంలో డీసీపీ సునీతా రెడ్డి, ఆర్డీవో సూరజ్ కుమార్, ఏసీపీ శ్రీనివాస్, తాసీల్దార్ మాదవి రెడ్డి, మున్సిపల్ కమిషనర్లు సుమన్ రావు, వసంత, నీటి పారుదల అధికారులతో సమావేశం ఏర్పాటు చేసిన్నట్లు సమాచారం.