నాగారం మున్సిపాలిటీలో రూ. 981.95 లక్షల ఆస్తిపన్ను లక్ష్యం
నేటి వరకు రూ. 714.03 లక్షల వసూళ్లు
మొండి బకాయిదారులకు రెడ్ నోటీసులు జారీ
మున్సిపల్ కమిషనర్ వెల్లడి
మేడ్చల్ కలెక్టరేట్, మార్చి 29: నాగారం మున్సిపాలిటీలో ఆస్తిపన్ను వసూళ్లలో మున్సిపల్ అధికారులు వేగం పెంచారు. ఆస్తిపన్ను వసూళ్లకు గడువు తక్కువగా ఉండడంతో లక్ష్యాన్ని చేరుకునేందకు సెలవుదినాల్లో సైతం అధికారులు, సిబ్బంది పనిచేస్తున్నారు. గత సంవత్సర లక్ష్యాన్ని విజయవంతంగా పూర్తి చేసిన రెవెన్యూ అధికారులు, ఈ ఏడు తమకు ఇచ్చిన లక్ష్యాన్ని 100 శాతం పూర్తి చేయాడానికి కృషి చేస్తున్నారు. మున్సిపాలిటీ పరిధిలో ఉన్న 16764 ఇండ్ల ఉండగా ఆస్తిపన్ను రూ. 981. 95 లక్షల లక్ష్యానికి గాను ఇప్పటి వరకు రూ. 714.03 లక్షలు వసూళ్లు చేసిన అధికారులు టార్గెట్ను చేదించేందుకు ప్రణాళికాబద్దంగా ముందుకు పొతున్నారు. ఈ నెల 28వ తేది వరకు 73 శాతం పన్నులు వసూళ్లు చెల్లించగా ఇంకా రూ. 267.92 లక్షలను వసూలు కావాల్సి ఉంది. మున్సిపాలిటీ పరిధిలో నాగారం, రాంపల్లిలో పన్నుల వసూళ్లపై ప్రత్యేకంగా విధులు నిర్వహిస్తున్నారు. ఉద యం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు మున్సిపల్ సిబ్బంది ఆస్తిపన్ను వసూళ్లు చేస్తున్నారు. 10 మంది బిల్ కలెక్టర్లతో పాటు మరో 10 మంది పన్నులు వసూళ్లు చేస్తుండగా వారిపై 5 మంది అధికారులు నిఘా ఉంచా రు. మార్చి 31వ తేది వరకు అధికారులకు, సిబ్బందికి ఎలాంటి సెలవులు లేవని కమిషనర్ వాణిరెడ్డి తెలిపారు.
సకాలంలో చెల్లించండి
ఆస్తిపన్ను చెల్లించని మొండి బకాయిదారులపై దృష్టి సారించాము. ఇప్పటికే మొండి బకాయిదారులకు రెడ్ నోటీసులు జారీ చేశాము. స్పం దించని బకాయిదారుల ఆస్తులను సీజ్ చేస్తాము. మొండి బకాయిదారులపై కఠినంగా వ్యవహరించి చర్యలు తీసుకుంటాము. సకాలంలో పన్నులు చెల్లించి మున్సిపాలిటీ అభివృద్ధికి సహకరించాలి. – ఎ.వాణి రెడ్డి, కమిషనర్, నాగారం మున్సిపాలిటీ
31 వరకు గడువు
గృహవినియోగదారులు, వాణి జ్య సముదాయ వినియోగదారు లు వన్టైమ్ సెటిల్మెంట్ను అవకాశాన్ని వినియోగించుకొని ఈనె ల31లోపు పన్నులు చెల్లించాలి.
–చంద్రారెడ్డి, చైర్మన్, నాగారం మున్సిపాలిటీ.