సుల్తాన్బజార్ : అగ్నిప్రమాదంలో కాలిన గాయాలతో మృతి చెందిన ఐదేండ్ల ముజమిల్ (5)మృతదేహానికి ఉస్మానియా దవాఖానలో పోస్టు మార్టం పూర్తి చేశారు. ఈ మేరకు ఆదివారం ఉదయం ఉ స్మానియా ఫోరెన్సిక్ విభాగం వైద్యులు డాక్టర్ యాదయ్య నేతృత్వంలోని వైద్య బృందం పోస్టుమార్టం నిర్వహించారు.
రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం కొత్తూరు మండలంలోని ఇనుముల్ సర్వ గ్రామ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో జరిగిన అగ్నిప్రమాదంలో ఒకటవ తరగతి చదువుతున్న ఐదేండ్ల ముజమిల్ (5) తీవ్రంగా గాయపడ్డాడు. ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొందుతున్న బాలుడు ఆదివారం తెల్లవారుజామున మృతి చెందాడు.
దీంతో పోస్టు మార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు.ఈ విషయం తెలుసుకున్న బాలుడి కుటుంబసభ్యులు, బంధువులు ఉస్మానియా మార్చురీ వద్దకు చేరుకోవడంతో అక్కడ ఉద్విగ్న వాతావరణం చోటుచేసుకుంది. బాలుడి కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి.