హైదరాబాద్ : ప్రతి ఒక్కరు మొక్కలు నాటి సంరక్షించాలని చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి అన్నారు. రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా ఆదివారం తన పుట్టినరోజు సందర్భంగా జూబ్లీహిల్స్లోని జీహెచ్ఎంసీ పార్కులో మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..గ్రీన్ ఇండియా చాలెంజ్ గొప్ప కార్యక్రమం అన్నారు. తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన సంతోష్ కుమార్కు కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమంలో రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, బీసీ కమిషన్ సభ్యుడు శుభప్రద్ పటేల్, వికారాబాద్ జెడ్పీ వైస్ చైర్మన్ విజయకుమార్, ఇతర ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.