సిటీబ్యూరో, జూలై 8 (నమస్తే తెలంగాణ): బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాగల రెండు రోజులు గ్రేటర్లోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. కాగా ఆవర్తన ప్రభావంతో నగరంలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు గరిష్ఠ ఉష్ణోగ్రతలు 30.1డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 23.7డిగ్రీలు, గాలిలో తేమ 68శాతంగా నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.