హైదరాబాద్ : సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బంగారు బోనం సమర్పించారు. ఈ సందర్భంగా కవిత అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అర్చకులు కవితను ఆశీర్వదించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. కవిత వెంట మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబ సభ్యులు, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత రెడ్డితో పాటు పలువురు టీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.
అంతకు ముందు మోండా మార్కెట్ డివిజన్లోని ఆదయ్య నగర్ లైబ్రరీ నుంచి 2 వేల మంది మహిళలతో ఎమ్మెల్సీ కవిత ర్యాలీగా బయల్దేరి అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు.
సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బంగారు బోనం సమర్పించేందుకు 2 వేల మంది మహిళలతో ర్యాలీగా బయల్దేరిన టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత.. pic.twitter.com/NProoXisVy
— Namasthe Telangana (@ntdailyonline) July 17, 2022