కుత్బుల్లాపూర్, జూలై 7: ప్రజలకు ఇచ్చిన మాట తప్పలేదు.. ఇచ్చిన మాట మేరకు నియోజకవర్గంలో సమస్యలను దశలవారీగా పరిష్కరించి, ప్రజలకు మెరుగైన వసతులు కల్పించాం కాబట్టే నేడు తాను చేపట్టిన ప్రగతియాత్రకు కాలనీల మహిళలు, ప్రజలు మంగళహరతులతో.. పూలవర్షంతో సంతోషంగా స్వాగతం పలుకుతున్నారని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. శుక్రవారం కుత్బుల్లాపూర్ 131 డివిజన్ పరిధిలో మాణిక్యనగర్, అంబేద్కర్నగర్లో తన ప్రగతియాత్రలో భాగంగా 84వ రోజు పర్యటించారు.
ఈ సందర్భంగా ఆయా కాలనీల్లో చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూనే.. ఇంకా మిగిలి ఉన్న సమస్యలను అక్కడే సంబంధిత అధికారులతో చర్చించి, ప్రణాళికలను సిద్ధం చేయాలని ఆదేశించారు. అనంతరం ఆయా కాలనీవాసులతో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో నియోజకవర్గంలో సుమారు 6 వేల కోట్ల నిధులతో పలు అభివృద్ధి పనులు చేపట్టి రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నానని పేర్కొన్నారు. ఎన్నికల్లో తాను ఇచ్చిన మాటకు కట్టుబడి నిలిచానని, కేవలం మాటలవరకే పరిమితం కాకుండా చేతల్లోనూ ప్రజలకు మెరుగైన సదుపాయాలకు డివిజన్ల వారీగా రూ.కోట్ల నిధులతో అభివృద్ధి పనులు చేపట్టి మీ ముందుకు వస్తున్నాన్నారు. ఇదే స్ఫూర్తితో రాబోయే రోజుల్లో ఇంకా మిగిలి ఉన్న సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కరించేందుకు మీ సహకారం కావాలని స్థానిక ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కేఎం గౌరీశ్, మాజీ కౌన్సిలర్ సూర్యప్రభ, పార్టీ డివిజన్ అధ్యక్షుడు డి.శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి సత్తిరెడ్డి, సీనియర్ నాయకులు కిశోర్చారీ, నార్లకంటి బాలయ్య, రమేశ్, నసీర్, బాలరాజ్చారి, జగదీశ్ గౌడ్, సలీం, అజయ్, మక్బుల్, కయ్యుం, సురేశ్, రాజు, వెంకటేశ్, మధుకర్రెడ్డి, సదానందం, జయంచారి, రాజశేఖర్రెడ్డి, కనకయ్య, గణేశ్, అరుణలత, లక్ష్మి, మనోహర, శశికళ, స్వరూప, రమణారెడ్డి, సురేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కల్వర్టును త్వరితగతిన పూర్తి చేయాలి..
కుత్బుల్లాపూర్ డివిజన్ చింతల్ శ్రీనివాస్నగర్లో నిర్మాణంలో ఉన్న నాలా కల్వర్టు నిర్మాణ పనులను సకాలంలో పూర్తి చేసేలా సత్వరమే చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్ అధికారులకు ఎమ్మెల్యే కేపీ ఆదేశించారు. ప్రగతియాత్ర పర్యటన అనంతరం కల్వర్టు వద్దకు వెళ్లి అభివృద్ధి పనులను పరిశీలించిన అనంతరం సంబంధిత శాఖా అధికారులకు పలు సూచనలు ఇచ్చారు. ఇప్పటికే ఈ ప్రాంతంలో ఇరుకురోడ్లు కావడం పట్ల ట్రాఫిక్కు వచ్చిపోయే వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇదే ప్రధాన రహదారి కావడంతో దీనిని సకాలంలో పూర్తి చేసేలా అధికారులు తగిన చర్యలు తీసుకుని త్వరలో అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.
కాలనీలు, బస్తీల్లో మెరుగైన వసతులు కల్పిస్తున్నాం
ప్రజల అవసరాలకు అనుగుణంగా నియోజకవర్గం పరిధిలోని అన్ని కాలనీలు, బస్తీల్లో మెరుగైన వసతులు కల్పిస్తున్నామని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం శాసన సభ్యులు కేపీ వివేకానంద్ అన్నారు. గాజులరామారం డివిజన్ పరిధిలోని జెసిం ట గార్డెన్స్ కాలనీలో శుక్రవారం ఆయన మిషన్భగీరథ పథకంలో భాగంగా ఏర్పాటు చేసిన తాగునీటి నల్లా (కుళాయి) లను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ మాట్లాడుతూ.. ప్రజాఅవసరాలకు అనుగుణంగా మెరుగైన వసతులు కల్పించేందుకు కృషిచేస్తున్నామన్నారు. కొత్తగా ఏర్పాటైన కాలనీలు, బస్తీల్లోనూ ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు తెలిపారు. అంతకు ముందు కాలనీవాసులు ఎమ్మెల్యేకు మంగళహారతులతో ఘనస్వాగతం పలికారు. తమకాలనీకి భగీరథ నీటి వసతిని కల్పించడంపట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యేను సత్కరించారు. ఈ కార్యక్రమంలో వాటర్వర్క్ ్స జీఎం,శ్రీధర్, డీజీ ఎం అప్పలనాయుడు, మేనేజర్ రోహిణితో పాటు పెద్దసంఖ్యలో కాలనీవాసులు పాల్గొన్నారు.
మెడికల్ కాలేజీ మంజూరుపై కృతజ్ఞతలు
కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి తెలంగాణ ప్రభుత్వం నూతనంగా మెడికల్ కాలేజీ మంజూరు చేయడం పట్ల దుండిగల్ మున్సిపాలిటీ డీ.పోచంపల్లికి చెందిన నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం ఎమ్మెల్యే వివేకానంద్ను కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఎమ్మెల్యే వివేకానంద్ను కలిసిన వారి లో డీ.పోచంపల్లి గ్రామ మాజీ ఉపసర్పంచ్ నరేందర్ రెడ్డి తదితరులు ఉన్నారు.