మల్కాజిగిరి, డిసెంబర్ 24: ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. ఆదివారం మచ్చబొల్లారం డివిజన్,సాయినగర్ కాలనీలో ఎమ్మెల్యే పాదయాత్రచేసి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సం దర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మురుగునీటి పారుదల సరిగ్గా లేకపోవడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నట్లు గుర్తించామని అన్నారు.
అధికారులతో సర్వే చేయించి నివేదికలను ప్రభుత్వానికి సమర్పించి..నిధులు మంజూరైన వెంటనే అభివృద్ధి పనులు ప్రారంభిస్తామ అన్నారు. కొత్త చెరువులో గుర్రపు డెక్క ఉండటంతో దోమల బెడద ఎక్కువగా ఉందని, ఎంటమాలజీ సిబ్బందితో డ్రౌన్ సహాయంతో దోమల నిర్మూలనకు రసాయనాలను చల్లిస్తామని అన్నారు. రోడ్లు గుంతలు పడడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే సీసీ రోడ్ల నిర్మాణ పనులు చేపడుతామని అన్నారు. కార్యక్రమంలో పరమేశ్, డోలి రమేశ్, పవన్, జ్ఞానేశ్వర్, బాలరాజు, లక్ష్మారెడ్డి, కృష్ణ, బషీర్, హరిత ముదిరాజ్ పాల్గొన్నారు.