మల్కాజిగిరి, డిసెంబర్ 17 : పేదలు ఆర్థికంగా ఎదగడానికి కృషి చేస్తామని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి(MLA Marri Rajasekhar Reddy) అన్నారు. ఆదివారం మల్కాజిగిరి సర్కిల్లో కార్పొరేటర్లు శాంతిశ్రీనివాస్ రెడ్డి, సబితాకిశోర్తో కలసి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి కల్యాణ లక్ష్మి-షాదీముబారక్(Kalyana Lakshmi) చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదల ఇండ్లలో ఆడ బిడ్డల పెండ్లికి తల్లిదండ్రులు అప్పులు చేసి పెండ్లిలు చేసేవారు.
ఆ పరిస్థిని గుర్తించిన నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ కల్యాణ లక్ష్మి-షాదీముబారక్ పథకాలను ప్రవేశపెట్టి రూ.1,00,116ఆర్థిక సహాయం అందజేశారని పేర్కొన్నారు. పేద కుటుంబంలోని ఆడ బిడ్డ పెండ్లి కోసం కల్యాణ లక్ష్మి-షాదీముబారక్ కోసం దరఖాస్తు చేసుకున్న వెంటనే మంజూరు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో చింతల శ్రీనివాస్ రెడ్డి, సయ్యద్ మోసిన్, పుదారి రాజేష్ కన్న, ప్రభాకర్, శ్రీధర్గౌడ్, ప్రేమ్, హరి, వీఎన్ రాజు, సన్దిప్, వీణ, రేణుక, రహమత్ తదితరులు పాల్గొన్నారు.