ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్
ఈద్గాల వద్ద ఏర్పాట్లు పరిశీలన
వెంగళరావునగర్, మే 2: రంజాన్ పండుగ సందర్భంగా యూసుఫ్గూడ పోలీసు బెటాలియన్ గ్రౌండ్స్ ఈద్గా లో నిర్వహించినున్న ప్రత్యేక ప్రార్థనల ఏర్పాట్లను ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంజాన్ పండుగ సందర్భంగా ముస్లింలు ప్రార్థనలు నిర్వహించుకునేందుకు వీలుగా ఎటువంటి అసౌకర్యాలు కలుగకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. గత రెండు సంవత్సరాలుగా కరోనా మహమ్మారి వల్ల రంజాన్ పండుకను ఇండ్లల్లోనే జరుపుకున్నారని తెలిపారు.
ఈ సారి అల్లా దీవెనల వల్ల రంజాన్ పండుగను ఎంతో సంతోషంగా ఈద్గాలో ప్రార్థనలు చేసి జరుపుకోనున్నట్లు తెలిపారు. ఈ సంవత్సరం రంజాన్ పండుగ సందర్భంగా ఈద్గాలలో ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఏర్పాట్లను పరిశీలించేందుకు వచ్చిన మాగంటిని ముస్లిం సంప్రదాయబద్ధంగా సత్కరించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ రాజ్ కుమార్ పటేల్, కార్యక్రమం నిర్వాహకులు అధ్యక్షులు సయ్యద్ హుమాయూన్, సయ్యద్ లయక్ లీ, జాకీర్, డివిజన్ అధ్యక్షులు సంతోష్ ముదిరాజ్,ప్రధాన కార్యదర్శి నర్సింగ్ దాస్, శ్రీను, అజర్ తదితరులు పాల్గొన్నారు.