కేపీహెచ్బీ కాలనీ, జూలై 28 : తొమ్మిదేండ్ల కాలంలో దీర్ఘకాలిక సమస్యలన్నింటినీ పరిష్కరించి కూకట్పల్లిని ఆదర్శవంత నియోజకవర్గంగా అభివృద్ధి చేసినట్లు ఎమ్మె ల్యే మాధవరం కృష్ణారావు తెలిపారు. శుక్రవారం ఆయన క్యాంపు కార్యాలయంలో మాట్లాడుతూ.. ఆగస్టు 1నుంచి ప్రజా సమస్యలపై చేపట్టనున్న పాదయాత్రపై ఆయా డివిజన్ల కార్పొరేటర్లు, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ల సహకారంతో కూకట్పల్లి నియోజకవర్గానికి వేలాది కోట్ల రూపాయలు వెచ్చించి అభివృద్ధి చేసినట్లు తెలిపారు. మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యతనిస్తూ రోడ్లు, డ్రైనేజీలు, తాగునీటి పైప్లైన్ వ్యవస్థలను ఆధునీకరించి నట్లు చెప్పారు. ప్రణాళికాబద్ధంగా చేసిన అభివృద్ధి పనుల కారణంగా..
భారీ వర్షాలు కురిసినా ప్రజలకు ఇబ్బందులు తలెత్తలేదని అన్నారు. తొమ్మిదేండ్ల కాలంలో చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరించాల్సిన బాధ్యత కార్పొరేటర్లు, బీఆర్ఎస్ పార్టీ నేతలపై ఉందన్నారు. నియోజకవర్గంలో ఇప్పటికే 90శాతం సమస్యలను పరిష్కరించామని.. మిగిలిన సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు ఆగస్టు 1 నుంచి పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కాలనీలు, బస్తీలలో ప్రజలందరినీ కలిసి సమస్యలు అడిగి తెలుసుకుని సమస్యలను వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటానన్నారు. పాదయాత్ర విజయవంతానికి కాలనీల వెల్ఫేర్ అసోసియషన్లు, బీఆర్ఎస్ పార్టీ నేతలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు మందడి శ్రీనివాస్రావు, పగుడాల శిరీషాబాబురావు, సబీహాగౌసుద్దీన్, పండాల సతీశ్గౌడ్, ముద్దం నర్సింహయాదవ్, ఆవుల, రవీందర్రెడ్డి, జూపల్లి సత్యనారాయణ, మహేశ్వరిశ్రీహరి, మాజీ కార్పొరేటర్లు తూము శ్రావణ్కుమార్, పగుడాల బాబురావు ఆయా డివిజన్ల అధ్యక్షులు, బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు.
వరదనీటి ముంపు సమస్యలను పరిష్కరించే దిశగా అధికారులు చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా బాలాజీనగర్ డివిజన్ ఆంజనేయనగర్లో పార్కు ప్రహరీ కూలిపోవడంతో పక్కన అపార్టుమెంట్ వాసులు ఇబ్బందులు పడుతున్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే అధికారులతో కలిసి కూలిపోయిన గోడను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రహరీ శిథిలాలను వెంటనే తొలగించి, తిరిగి ప్రహరీని నిర్మించాలని అధికారులను ఆదేశించారు. జడ్సీ మమత, డీసీ రమేశ్, తాసీల్దార్ గోవర్ధన్, ఈఈ సత్యనారాయణ, డీఈ ఆనంద్, స్థానిక నేతలున్నారు.
అల్లాపూర్ 28: వర్షాల నేపథ్యంలో రాజీవ్గాంధీనగర్, సఫ్థార్నగర్లలో జోనల్ కమిషనర్ మ మత, కార్పొరేటర్ సబీహాబేగంతో కలిసి ఎమ్మెల్యే మా ధవరం కృష్ణారావు శుక్రవారం పర్యటించారు. ముంపు ప్రాం తాల్లో పర్యటించిన ఎమ్మెల్యే ఇండ్లలోకి వరదనీరు చేరడంతో ప్రజలు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలసుకున్నారు. మరో మూడు రోజులు భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో లోట్టుప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బస్తీలు ముంపునకు గురికాకుండా అత్యవసర సహాయక బృందాలు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. భారీ వర్షాల కారణం గా సిజనల్ వ్యాధుల విషయంలో ప్రజలు అప్రత్తమంగా ఉండాలని ఆయన సూచించారు.