కేపీహెచ్బీ కాలనీ, ఆగస్టు 29 : అభివృద్ధి, సంక్షేమం బీఆర్ఎస్తోనే సాధ్యమని.. బీజేపీ, కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నట్లు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. మంగళవారం క్యాంపు కార్యాలయంలో ఆయన సమక్షంలో మేడ్చల్ జిల్లా బీజేపీ ఎస్సీ మోర్చా ఉపాధ్యక్షుడు జక్కుల రాజు, కూకట్పల్లి డివిజన్ కార్యదర్శి సాయికిరణ్ బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..
సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రం కనీవిని ఎరుగని రీతిలో అభివృద్ధి సాధించిందన్నారు. పార్టీలో చేరిన బీజేపీ నేతలు జక్కుల రాజు, సాయికిరణ్ మాట్లాడుతూ.. బీజేపీలో గ్రూపు రాజకీయాలు ఇమడలేక పార్టీని వీడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ, వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ బొట్టు విష్ణు పాల్గొన్నారు.