మల్లాపూర్, మార్చి 17 : ప్రతి కాలనీలలో సీసీ కెమరాలు(CC cameras) ఏర్పాటు చేసుకోవాలని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి(MLA Lakshmareddy) అన్నారు. ఆదివారం ఆయన మల్లాపూర్(Mallapur) డివిజన్ పరిధిలోని కేఎల్రెడ్డి నగర్ అసోసియేషన్ భవనంలో ఏర్పాటు చేసిన సీసీ కెమరాలను స్థానిక కార్పొరేటర్ పన్నాల దేవేందర్రెడ్డితో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీసీ కెమెరాల ఏర్పాటుతో దొంగ తనాలకు ఆస్కారం ఉండదన్నారు. భద్రతపై ఎలాంటి ఇబ్బందులు ఉండవని స్పష్టంచేశారు. దుకాణ సముదాయాలు, కార్యాలయాల వద్దనే కాకుండా కాలనీవాసులు ఐకమత్యంతో ఉండి సీసీ కెమరాలు ఏర్పాటు చేసుకోవడం చాలా మంచి నిర్ణయమన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు మహేందర్రెడ్డి, యాకూబ్రెడ్డి, లక్ష్మి, జయశ్రీ, బీఆర్ఎస్ నాయకుడు వాసుగౌడ్, తదితరులు పాల్గొన్నారు.