కాచిగూడ/ గోల్నాక, ఆగస్టు 23 : పేద, మధ్య తరగతి ప్రజలకు ఆపత్కాలంలో సీఎం రిలీఫ్ ఫండ్ ఆర్థిక చేయూత అందిస్తుంని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. మంగళవారం గోల్నాకలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వివిధ ప్రాం తాలకు చెందిన 9 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మంజూరైన రూ.8.40లక్షల విలువగల చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అనారోగ్యానికి గురై దవాఖానల్లో చికిత్స పొందుతున్న అర్హులైన ప్రతి ఒక్కరికీ సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఆర్థిక సాయం అందజేస్తున్నామన్నారు. ఇందుకు సంబంధించి గోల్నాక తులసీనగర్ కాలనీలోని తన క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక సెల్ను ఏర్పాటు చేశామని తెలిపారు. బాధితులు వారి కుటుంబ సభ్యులు ఎవరైనా క్యాంపు కార్యాలయంలో సంప్రదించాలని ఆయన కోరారు. స్థానిక టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
అంబర్పేట నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ టికెట్ రెండవ సారి ఖరారు కావడంతో ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్కు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. మంగళవారం గోల్నాక క్యాంపు కార్యాలయం వద్ద నియోజకవర్గం బీఆర్ఎప్ పార్టీ శ్రేణులతో పాటు ఆయన అభిమానులు, పలు యువజన, మహిళా సంఘాల నాయకులతో పాటు పలు కుల సంఘాలకు చెందిన నాయకులు పెద్ద ఎత్తున తరలి వచ్చి కాలేరుకు మద్దతు ప్రకటించారు.
రెండవ సారి అంబర్ పేట నియోజకవర్గం బీఆర్ఎస్ టికెట్ ఖరారు కావడంతో మంగళవారం అంబర్పేట శ్రీరమణ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే కాలేరు నివాళులర్పించారు. కార్పొరేటర్ విజయ్కుమార్తో పాటు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
అంబర్ పేట అలీకేఫ్ చౌరస్తాలోని జ్యోతి రావు పూలే విగ్రహానికి మ్మెల్యే కాలేరు నివాళులర్పించారు. కార్పొరేటర్ విజయ్కుమార్గౌడ్ ఉన్నారు. అదేవిధంగా అంబర్పేట అంబర్ బాబాదర్గాలో కార్పొరేటర్ విజయ్ కుమార్ గౌడ్తో కలసి ఎమ్మెల్యే కాలేరు ప్రార్థనలు చేశారు.
పేద విద్యార్థులు చదివి, ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్న అశయంతో ముందుకు వెళ్లిన వ్యక్తి రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి అని అంబర్పేట ఎమ్మె ల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు.రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి155వ జయంతి సందర్భంగా మంగళవారం నారాయణగూడ వైఎంసీఏ జంక్షన్లో వెంకట్రామరెడ్డి విగ్రహానికి ఎమ్మెల్యే కాలేరు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని ప్రతి జంక్షన్ను అభివృద్ధి చేస్తున్నట్లు పేర్కొన్నారు.
విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లోనూ రాణించాలని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. మంగళవారం అంబ ర్ పేట మున్సిపల్ మైదానంలో హైదరాబాద్ జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అంబర్పేట, హిమాయత్నగర్ జోన్ల పరిధిలోని పలు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు నిర్వహించిన ఖో ఖో, కబడ్డీ పోటీలను కార్పొరేటర్ విజయ్కుమార్గౌడ్తో కలసి ఆయన ప్రారంభించారు. డీఈవో ఖాజానిజాముద్దీన్, శ్యామల్రాజు, డిప్యూటీ ఐవోఎస్ లక్ష్మణ్సింగ్, ఆర్గనైజింగ్ సెక్రటరీ సోమశేఖర్, జనరల్ సెక్రటరీలు దిలీప్ కుమార్, అంబర్పేట మండల ప్రైవేటు పాఠశాలల సంఘం ప్రతినిధులు మధుసూదన్, రాజశేఖర్రెడ్డి పాల్గొన్నారు.
అంబర్ పేట మండల కొత్త తాసీల్దార్గా బాధ్యతలు చేపట్టిన కె.భిక్షపతి మంగళవారం గోల్నాక క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ను కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.