అంబర్పేట/కాచిగూడ, అక్టోబర్ 18: ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి తనను మరోసారి ఆశీర్వదించాలని బీఆర్ఎస్ అంబర్పేట నియోజకవర్గ అభ్యర్థి, ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ ప్రజలను కోరారు. బాగ్అంబర్పేట డివిజన్లోని రహత్నగర్, న్యూవినాయకనగర్ తదితర ప్రాంతా ల్లో కార్పొరేటర్ బి.పద్మావెంకటరెడ్డి, బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు సీహెచ్ చంద్రమోహన్తో కలిసి కాలేరు తన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి ప్రజల మద్దతు కోరారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వివరిస్తూ కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. తనను గెలిపిస్తే నియోజకవర్గాన్ని మరింత ఆదర్శంగా తీర్చిదిద్దుతానని, అండగా ఉంటానని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన డప్పు కొడుతూ ఎన్నికల శంఖారావం పూరించారు. రహత్నగర్లో ముస్లింలు అధికంగా ఉన్నా రని ప్రభుత్వం వారికోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నదని వివరించారు. కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో అనేక సంక్షేమ పథకాలు అమలు కావడంతో ప్రజలు బీఆర్ఎస్ పార్టీని ఎంతగానో విశ్వసిస్తున్నారని అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. సెంట్రల్ పీస్కమిటీ సభ్యుడు, ఈస్ట్జోన్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎన్.శరత్శ్యామ్ ఆధ్వర్యంలో బుధవారం బర్కత్పుర హౌజింగ్బోర్డు ఎల్ఐజీహెచ్ కాలనీ రెసిడెన్సీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు, కాలనీ వాసులంతా అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి కాలేరు వెంకటేశ్కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలేరు మాట్లాడుతూ రాష్ట్రంలో అభివృద్ధిని చూసి ప్రజలంతా బీఆర్ఎస్కు మద్దతు ఇస్తున్నారని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ పరిపాలనకు జనం జేజేలు పలుకుతున్నారని అన్నారు. కార్యక్రమంలో ప్రధానకార్యదర్శి పి.కిశోర్, టీ. వివేకానంద్, పి.వెంకటేశ్వర్రెడ్డి, రాంచందర్, బాబు, పెంటం రమేశ్, ప్రతాప్రెడ్డి, శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.