చంపాపేట, నవంబర్ 25 : ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు భరోసా ఇస్తుందని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. చంపాపేట డివిజన్ ఉదయ్నగర్ కాలనీకి చెందిన నాగరాజుకు మంజూరైన రూ.2లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును శుక్రవారం ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదలకు నాణ్యమైన వైద్యం అందించేందుకు సీఎం సహాయనిధి అండగా నిలుస్తుందని తెలిపారు. అర్హులందరూ ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం రాష్ట్ర నాయకుడు ఓరుగంటి వెంకటేశం గౌడ్, టీఆర్ఎస్ హస్తినాపురం డివిజన్ అధ్యక్షుడు సత్యంచారి, నాయకులు అమరేందర్ రెడ్డి, సాగర్ తదితరులు పాల్గొన్నారు.
భక్తిశ్రద్ధలతో అయ్యప్ప పడి పూజ
చంపాపేట డివిజన్ పరిధిలోని దుర్గాభవానీనగర్ కాలనీలో అయ్యప్ప గురుస్వాములు కొంతం మధుసూదన్ రెడ్డి, ఎలిమినేటి నిషికాంత్రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన అయ్యప్ప మహాపడి పూజలో ఎల్బీనగర ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు నల్ల రఘుమారెడ్డి, ముడుపు రాజ్కుమార్రెడ్డి, శాగ రోజారెడ్డి, గూడూరు గౌతంరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.