ఎల్బీనగర్, ఫిబ్రవరి 27 : పేదలకు కార్పొరేట్ వైద్యం అందించడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ కొత్తపేటలో సూప ర్ స్పెషాలిటీ దవాఖాన ఏర్పాటుకు శ్రీకారం చుట్టారని ఎంఆర్డీసీఎల్ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి తెలిపారు. సోమవారం కొత్తపేట్లోని ఫ్రూట్ మార్కెట్ స్థలం లో నూతనంగా నిర్మించనున్న టిమ్స్ ఆస్పత్రి స్థలాన్ని ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హైదరాబాద్ మహానగరానికి అనారోగ్య సమస్యలతో వై ద్యం కోసం రాష్ట్రవ్యాప్తంగా నలుమూలల నుంచి వస్తున్న విషయం అందరికీ తెలిసిందేనని అన్నారు.
రోజుకు వేలాది మంది ప్రజలు ఆరోగ్య సమస్యల పట్ల ఇక్కడికి వస్తున్న నేపథ్యంలో నిమ్స్, ఉస్మానియా, గాంధీ హాస్పిటల్లో ప్రజలకు వైద్య సేవలందించడం భారంగా మారిందని అన్నారు. దీనిపై సీఎం కేసీఆర్ జంట నగరాల్లో నలుదిక్కులా సూపర్ స్పెషాలిటీ దవాఖానలను నిర్మించడం జరుగుతున్నదని తెలిపారు. ఆస్పత్రి నిర్మాణానికి ఎల్అండ్టీ సంస్థ టెండర్లు దక్కించుకున్నదని తెలిపారు. ప్రభు త్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న దవాఖాన నిర్మాణ పనుల్లో భాగంగా అనుమతులు చివరి దశలో ఉన్నాయని తెలిపారు. అతి త్వరలో పనులు పూర్తిస్థాయిలో ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నామని, ఎల్అండ్టీ సంస్థ కార్మికులు ఉండడానికి తాత్కాలికంగా నిర్మిస్తున్న పనులను సైతం పరిశీలిస్తున్నామని తెలిపారు.
కొన్ని రాజకీయ పార్టీలు తమ స్వార్థ రాజకీయాల కోసం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణానికి అడ్డుపడుతూ కొన్ని అవరోధాలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. కావాలనే నిర్మాణ స్థలంలో క్రికెట్తోపాటు ఇతర కార్యక్రమాలు నిర్వహించడం వారి మూర్ఖత్వానికి నిదర్శనమన్నారు. ఎల్బీనగర్ నియోజకవర్గం అన్ని విధాల అభివృద్ధి చేయడం జీర్ణించుకోలేకపోతున్నారని, పదేపదే నాపై నిందలు మోపుతున్నారని అన్నారు. ఎవరెన్ని ఆరోపణలు చేసినా నియోజకవర్గం ప్రజల ఆర్థిక అభివృద్ధి, ప్రజా సంక్షేమ లక్ష్యంగా పనిచేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమం లో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు అనంతుల రాజిరెడ్డి, పలువురు పోలీస్ అధికారులు పాల్గొన్నారు.