మన్సూరాబాద్, జూన్ 13: మహిళా అభ్యున్నతే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పని చేస్తూ.. వారి అభివృద్ధికి దేశంలో ఎక్కడా లేని విధంగా ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం మన్సూరాబాద్ డివిజన్ పరిధి చింతలకుంటలోని ప్రలవిగార్డెన్లో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ మహిళా సంక్షేమ దినోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్సీలు ఎగ్గె మల్లేశం కురుమ, బొగ్గారపు దయానంద్ గుప్తాతో కలిసి ఎమ్మెల్సీ దేవిరెడ్డి సుధీర్రెడ్డి హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. తెలంగాణ మహిళా సంక్షేమ దినోత్సవ కార్యక్రమానికి పెద్దఎత్తున హాజరై మహిళలు బతుకమ్మ పాటలు, ఆటలతో అలరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి రంగంలోనూ సీఎం కేసీఆర్ మహిళలకు పెద్ద పీట వేస్తున్నారని తెలిపారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్, ఒంటరి మహిళా పింఛన్లు, కేసీఆర్ కిట్, న్యూట్రీషన్ కిట్, ఆరోగ్య మహిళా తదితర పథకాలను ప్రవేశపెట్టి మహిళలకు తోబుట్టువుగా సీఎం కేసీఆర్ మారారని తెలిపారు. గృహలక్ష్మి పేరిట ఇండ్లు నిర్మించుకునేందుకు త్వరలో సీఎం కేసీఆర్ రూ. 3 లక్షల ఆర్థిక సహాయం అందించనున్నారని తెలిపారు. మహిళల రక్షణ కోసం షీటీమ్స్, భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయడంతో పాటు మార్కెట్ కమిటీల్లోను మహిళలకు రిజర్వేషన్లు కల్పించడం జరిగిందని పేర్కొన్నారు. అంగన్వాడీ టీచర్లకు గతంలో రూ.4,200 జీతం ఉండగా సీఎం కేసీఆర్ వారికి ప్రస్తుతం రూ.13,650 జీతం అందిస్తున్నారని తెలిపారు. పేదింటి ఆడబిడ్డలు పండుగలను సుఖసంతోషాలతో జరుపుకోవాలనే సంకల్పంతో హిందువులు జరుపుకొనే బతుకమ్మ పండుగకు చీరలు, క్రిస్మస్, రంజాన్ పండుగలకు నూతన వస్ర్తాలతో కూడిన కిట్లను అందజేసి ఆపన్నహస్తం అందిస్తున్నారని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ మహిళా పక్షపాతి అని రాష్ట్రంలోని మహిళలకు అన్నగా అండగా నిలుస్తున్నాడని తెలిపారు.
మహిళల భద్రత కోసం సీఎం కేసీఆర్ షీటీమ్స్ను ఏర్పాటు చేశారని ఎమ్మెల్సీలు ఎగ్గె మల్లేశం కురుమ, బొగ్గారపు దయానంద్ గుప్తా తెలిపారు. మహిళలకు ఏ కష్టం వచ్చిన షీటీమ్స్ బృందాలు వెంటనే స్పందిస్తూ ఆకతాయీల ఆటలు కట్టిస్తున్నాయని పేర్కొన్నారు. అదేవిధంగా కార్యక్రమానికి ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి సతీమణి కమలా సుధీర్రెడ్డి హాజరై మహిళలకు తెలంగాణ మహిళా సంక్షేమ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ప్రవేశపెడుతున్న పథకాలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి సతీమణి కమలా సుధీర్రెడ్డి, జోనల్ కమిషనర్ పంకజ, డీసీలు మారుతీదివాకర్, హరికృష్ణయ్య, హయత్నగర్ తాసీల్దార్ సంధ్యారాణి, టౌన్ ప్లానింగ్ ఏసీపీ సుష్మిత, కర్మన్ఘాట్ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయ మాజీ చైర్పర్సన్ పోచబోయిన ఈశ్వరమ్మయాదవ్, బీఆర్ఎస్ మన్సూరాబాద్ డివిజన్ మహిళా విభాగం అధ్యక్షురాలు కొసనం ధనలక్ష్మి, నాయకులు జక్కిడి రఘువీర్ రెడ్డి, కొసనం వెంకట్రెడ్డి, కూరెళ్ల వేములయ్యగౌడ్, ఏలుకొండ రాంకోటి తదితరులు పాల్గొన్నారు.