BRS | ఎల్బీనగర్: బీఆర్ఎస్ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆ పార్టీ మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి కోరారు. సోమవారం కర్మన్ఘాట్ కొత్తకాపు యాదవరెడ్డి గార్డెన్స్లో జరిగిన ఎల్బీనగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ ముఖ్య నేతల సమావేశంలో ఆయన ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాగిడి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్ నగరాన్ని ప్రపంచపటంలో నిలిపిన ఘనత, ఐటీ అభివృద్ధికి కారణం కేసీఆరేనన్నారు.
రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనన్నారు. తనకు పోటీ చేసే అవకాశం కల్పించిన కేసీఆర్, కేటీఆర్, హరీశ్రావుకు ధన్యవాదాలు తెలిపారు. ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి మాట్లాడుతూ.. మల్కాజిగిరిలో బీఆర్ఎస్దే విజయమన్నారు. ఎంపీగా రాగిడి లక్ష్మారెడ్డి విజయం ఖాయమన్నారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు సామ తిరుమల్రెడ్డి, కొప్పుల విఠల్రెడ్డి, ప్రవీణ్కుమార్, జిట్టా రాజశేఖర్రెడ్డి, జీవీ సాగర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.