రామంతాపూర్, డిసెంబర్ 25: లోకానికి ప్రేమ, దయ, కరుణను పంచిన ఏసుక్రీస్తు జీవితం అందరికీ అనుసరణీ యమని ఎమ్మెల్యే బేతి సుభాష్రెడి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున క్రిస్మస్ విందును ఏర్పాటు చేసి, క్రైస్తవులకు కానుకలను ఏటా అందజేస్తున్న సీఎం కేసీఆర్ అన్ని మతాలకు సముచిత గౌరవాన్నిస్తున్నారని ఆయన వివరించారు. ఆదివారం రామంతాపూర్ ప్రధాన రహదారిలో బాప్తిస్టు చర్చిలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకలకు ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి హాజరయ్యారు. చర్చి ప్రతినిధులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపి ప్రత్యేక పార్థనలో పాల్గొన్నారు. ఆ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడు తూ.. సబ్బండ వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని, అందులో భాగంగానే క్రిస్మస్ పండుగకు ప్రభుత్వం కానుకలను అందజేసిందన్నారు.
ప్రపంచ మానవాళికి శాంతి సందేశాన్నిచ్చిన ‘శాంతిదూత’ ఏసుక్రీస్తు అని కొనియాడారు. ఏసుక్రీస్తు పుట్టిన రోజును పురస్కరించుకుని ప్రపంచంలోని క్రైస్తవులు ఎంతో గొప్పగా క్రిస్మస్ను జరుపుకుంటారని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలను ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎంతో గొప్పగా నిర్వహిస్తున్నామన్నారు. ప్రభుత్వం క్రైస్తవుల సంక్షేమం కోసం ఎంతో కృషి చేస్తుందని, ఉప్పల్లో ప్రభుత్వం నిర్మిస్తున్న క్రైస్తవ భవనానికి సంపూర్ణ సహాకారం అందిస్తామని తెలిపారు. కాగా, ఆదివారం ఉప్పల్ నియోజకవర్గ వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరి గాయి. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు గరిక సుధాకర్, సూరం శంకర్, శివ, రెవరెంట్ పాస్టర్ శ్యామ్యు ల్, సాజన్కుమార్, ప్రొఫెసర్ జయకుమార్, మధు,రాజశేఖర్, మోహన్, మురళి, స్టీవెన్ తదితరులు పాల్గొన్నారు.
*‘న్యూజెరుసేలం మినిస్ట్రీస్ చర్చి’లో..
ఉప్పల్, డిసెంబర్ 25: నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ఆదివారం క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ మేరకు చర్చిలను ప్రత్యేకంగా అలంకరించారు. క్రైస్తవులు చర్చిలలో ప్రత్యేక ప్రార్ధనలు చేసి, క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. నాచారం ప్రధాన రహదారిలోని మసీదులో నీరజ-రవికాంత్ ఆధ్వర్యంలో ‘న్యూజెరుసేలం మినిస్ట్రీస్ చర్చి’లో క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నాచారం కార్పొరేటర్ శాంతిసాయిజెన్ శేఖర్ హాజరై ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. అనంతరం కేక్ కట్చేసి, క్రిస్మస్ కానుకలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నేతలు సాయిజెన్ శేఖర్, కట్ట బుచ్చన్న, శ్రీనివాస్, రఫీక్ పాల్గొన్నారు.
*క్రిస్మస్ కానుకల పంపిణీ..
ఉప్పల్ గాంధీనగర్లోని ‘క్రిస్టియన్ కాన్సిట్యూషనల్ చర్చి’లో ఆదివారం క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా క్రిస్మస్ కానుకలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన క్రైస్తవ ధర్మ ప్రచార పరిరక్షణ సమితి అధ్యక్షులు జెరుసేలేం మత్తయ్య మాట్లాడుతూ.. ఏసుక్రీస్తు బోధనలు, తన జీవితం సమాజానికి ఆదర్శంగా నిలిచాయన్నారు. ఈ కార్యక్రమంలో ఏనోషు యబ్బేజ్, హెప్సిభ జోసెఫిన్, పాస్టర్ జాను పాల్గొన్నారు.
*ఇందిర మెమోరియల్ స్కూల్లో..
మల్లాపూర్, డిసెంబర్ 25: మల్లాపూర్ డివిజన్ అశోక్నగర్లోని ఇందిర మెమోరియల్ స్కూల్లో ఆదివారం కరస్పాండెంట్ రాజగోపాల్, విక్టర్ జోష్, కేక్కట్ చేసి క్రిస్మస్ వేడుకలను జరుపుకున్నారు. అలాగే క్రిస్మస్ వేడుకల్లో భాగంగా మీర్పేట్ హెచ్బీకాలనీ డివిజన్ పరిధిలోని కాలనీల్లో ఆదివారం జరిగిన వేడుకలకు కార్పొరేటర్ జె. ప్రభుదాస్ హాజరై కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ తిమోతి, సంఘం పెద్ద లు, స్ధానిక నాయకులు బాల్రాజ్, శేఖర్గౌడ్, సాయికుమార్, నవీణ్గౌడ్, కుమార్, నరేందర్ పాల్గొన్నారు.