ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు..
‘మల్కాజిగిరి’లో 65 మంది లబ్ధిదారులకు ‘దళిత బంధు’ మంజూరు పత్రాలు అందజేత
మల్కాజిగిరి, ఏప్రిల్ 5: దళితుల అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని ఎమ్మెల్మే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. మంగళవారం మల్కాజిగిరి సర్కిల్, చింతల్బస్తీలోని బాబూ జగ్జీవన్ రామ్ విగ్రహం సాక్షిగా దళిత బంధు పథకంలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఒక్కొక్కరికి రూ.10లక్షల చొప్పున 65మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే మంజూరు పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత ప్రభుత్వాలు దళితులను ఓటు బ్యాంక్ కోసం వాడుకున్నారని … అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం దళితులు ఆర్థికంగా స్వయం ఉపాధితో ఎదగడానికి దళిత బంధు పథకాన్ని అమలు పరుస్తున్నారని అన్నారు.
ఈ పథకం ద్వార వచ్చే రూ.10లక్షలతో స్వంతగా యూనిట్ను ఏర్పాటుచేసి మరికొందరికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలని అన్నారు. నియోజకవర్గంలో వందమందిని ఎంపిక చేశామని, మొదటి విడతగా 65మందికి మం జూరుపత్రాలు అందజేశామని అన్నారు. ఈ పథకంలో రూ.10లక్షల మొదటి మంజూరు పత్రాన్ని బీజేపీ నాయకుడు గణేశ్కు అందజేశామని అన్నారు. పార్టీలకు అతీతంగా పార దర్శకంగా ఎంపిక జరిగిందని అన్నారు. కార్యక్రమంలో జిల్లా డీవైఏ బాలరామారావు, కార్పొరేటర్లు ప్రేమ్కుమార్, సునీతాయా దవ్, మాజీ కార్పొరేటర్ జగదీశ్గౌడ్, గుండా నిరంజన్, అంజయ్య, సంతోశ్రాందాస్, బాబు, శ్రీనివాస్, సత్యనారాయణ, ఉపేందర్, గద్వాల జ్యోతి పాల్గొన్నారు.