చర్లపల్లి, మార్చి 4 : కాలనీల్లో నెలకొన్న సమస్యలను సత్వరమే పరిష్కరించి.. ఉప్పల్ను ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. ఏఎస్రావునగర్ డివిజన్, శ్రీనివాస్కాలనీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ శనివారం కాలనీవాసులు ఎమ్మెల్యేను కలిసి విన్నవించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గ పరిధిలోని కాలనీల సమగ్రాభివృద్ధికి నిధు లు కేటాయించి అభివృద్ధి పనులు చేపడుతున్నామని, పలు కాలనీల్లో చేపట్టిన పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాల ని అన్నారు. శ్రీనివాస్నగర్లోని కాలనీలో నెలకొన్న స మస్యలను దశలవారీగా పరిష్కరించేందుకు నిధులు కేటాయించనున్నట్లు ఆయన తెలిపారు.
ముఖ్యంగా కాలనీ లో పారిశుధ్య సమస్యలు, డ్రైనేజీ, మంచినీటి సమస్యలతోపాటు కాలనీలోని ఇతర సమస్యలను గుర్తించేందుకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. కాలనీలో వీధిదీపాల నిర్వహణను మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్నగర్ కాలనీ సంక్షేమ సంఘం ఆధ్య క్షుడు గూడూరు సుదర్శన్రెడ్డి, ఉపాధ్యక్షుడు మోహన్రావుతో పాటు కాలనీవాసులు, బీఆర్ఎస్ నేతలు జనుంపల్లి వెంకటేశ్వర్రెడ్డి, సుధాకర్, భాస్కర్రెడ్డి పాల్గొన్నారు.