కొండాపూర్, జనవరి 12 : సుందరీకరణ పనులతో చెరువులకు పూర్వ వైభవం సంతరించుకుంటుందని శేరిలింగంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. సేల్స్ఫోర్స్ ఐటీ సంస్థ సీఎస్ఆర్ నిధులు రూ. 1.50కోట్లతో చేపట్టిన చందానగర్ డివిజన్ పరిధిలోని రేగులకుంట చెరువు సుందరీకరణ పనులను ఇరిగేషన్ అధికారులతో కలిసి ఎమ్మెల్యే గాంధీ పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. చెరువుల సుందరీకరణ పనులతో పూర్వ వైభవం సంతరించుకుంటుందన్నారు. అన్యాక్రాంతమవుతున్న చెరువులను సుందరీకరణ పనులతో కాపాడుకోవడంతో పాటు అందంగా రూపుదిద్దుతున్నట్లు తెలిపారు. చెరువు చుట్టూ ఫెన్సింగ్తో పాటు వాకింగ్ ట్రాక్, ప్లే ఏరియాలు, పచ్చని చెట్లతో కళకళలాడేలా చేస్తున్నట్లు తెలిపారు. ఇరిగేషన్ అధికారులు డీఈ నళిని, ఏఈ పావని, సేల్స్ ఫోర్స్ సంస్థ ప్రతినిధులు చైతన్య తాళ్లూరి, రాము, బీఆర్ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
మియాపూర్, జనవరి 12:దేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటిన మహనీయుడు వివేకానందుడని ఎమ్మెల్యే గాంధీ పేర్కొన్నారు. యువత సహా ప్రతి ఒక్కరు ఆయన చూపిన మార్గంలో పయనించాలని పిలుపునిచ్చారు. వివేకానంద 161వ జయంతి వేడుకలను వివేకానందనగర్ డివిజన్లో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వివేకానందుడి విగ్రహానికి కార్పొరేటర్లు మాధవరం రోజాదేవి రంగారావు, నార్నె శ్రీనివాస్రావులతో కలిసి ఎమ్మెల్యే గాంధీ నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మందలో ఒకడిగా కాకుండా వందలో ఒకడిగా నిలవాలంటూ ఎన్నో స్ఫూర్తివంతమైన ప్రసంగాలతో యువతలో ఎంతో ఉత్తేజాన్ని నింపిన మహనీయుడని ఆయన మార్గం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తి దాయకమన్నారు. భారత ఆధ్యాత్మిక శక్తిని పెంపొందించిన వివేకానందుడి మాట బాట అనుసరణనీయమమని ఎమ్మెల్యే గాంధీ పేర్కొన్నారు.
చెరువులు మురుగు నీటితో కలుషితం కాకుండా పరిరక్షిస్తామని శుద్ధ జలాలతో ఉండేలా చర్యలు చేపడతామని ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. ప్రత్యేక ఛానళ్ల ద్వారా మురుగు నీటిని దారి మళ్లిస్తామన్నారు. హైదర్నగర్ డివిజన్ పరిధిలోని భీముని కుంట చెరువు అలుగును కార్పొరేటర్ నార్నె శ్రీనివాస్రావు, అధికారులతో కలిసి ఎమ్మెల్యే గాంధీ శుక్రవారం పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జలవాయు విహార్, హెచ్ఎంటీ శాతవాహన, హెచ్ఎంటీ హిల్స్ కాలనీల నుంచి వచ్చే మురుగు నీరు భీముని కుంటలోకి చేరుతుండటంతో కలుషితం అవుతున్నందున యుద్ధ ప్రాతిపదికన పరిశుభ్రత చర్యలు చేపడతామన్నారు. ప్రత్యేక డైవర్షన్ ఛానళ్లను ఏర్పాటు చేసి మురుగునీరు చేరకుండా చూస్తామని, అధికారులు తగు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. చెరువులను సుందరీకరించి ఆహ్లాదకర వాతావరణాన్ని కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే గాంధీ పేర్కొన్నారు. అధికారులు విశ్వం, వెంకటేశ్వర్లు, ప్రశాంతి, మహదేవ్, నేతలు పాల్గొన్నారు.
కాలనీ డివిజన్లో నూతనంగా ఏర్పడ్డ పాస్టర్స్ అసోసియేషన్ను కార్పొరేటర్ దొడ్ల వెంకటేశ్ గౌడ్తో కలిసి ఎమ్మెల్యే గాంధీ అభినందించారు. సర్వమతాలకు సమ ప్రాధాన్యతతో ముందుకు సాగుతానని ఎమ్మెల్యే పేర్కొన్నారు. సంఘం నూతన ప్రతినిధులు ఇజ్రాయిల్, రాజు, సురేశ్, దేవరాజు, ఫిలిప్, సునీల్ , శ్యామ్జాషువ, గోపి, సత్యరాజు పాల్గొన్నారు.