హైదరాబాద్: హైదరాబాద్లోని (Hyderabad) మణికొండలో కారు బీభత్సం సృష్టించింది. గోల్డెన్ టెంపుల్ వద్ద రోడ్డు పక్కన పార్క్ చేసిన బైకులపైకి దూసుకెళ్లింది. దీంతో అక్కడ నిల్చున్న ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. అయితే కారు ఆగకుండా వెళ్లడంతో స్థానికులు వెంబడించి పట్టుకున్నారు. ఈ సందర్భంగా కారును నడుపుతున్నదని మైనర్ బాలుడిగా గుర్తించారు.
పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకుని మైనర్ను అదుపులోకి తీసుకున్నారు. కారును సీజ్ చేసి పోలీస్స్టేషన్కు తరలించారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. కారు ఢీకొనడంతో 20 బైకులు ధ్వంసమయ్యాయని పోలీసులు తెలిపారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.