అమీర్పేట్, ఆగస్టు 21 : సనత్నగర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథం వైపు నడిస్తున్న మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ వచ్చే ఎన్నికల్లో గెలుపు సాధించి హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని అమీర్పేట్ మాజీ కార్పొరేటర్ శేషుకుమారి అన్నారు. రాష్ర్టాన్ని అన్ని విధాలుగా ప్రగతి బాట పట్టించిన సీఎం కేసీఆర్ నేతృత్వంలో మూడో సారి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు ఖాయమన్నారు. సనత్నగర్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అభ్యర్థిత్వం ఖరారు కావడంతో బీఆర్ఎస్ శ్రేణులు అమీర్పేట్ సత్యం థియేటర్ చౌరస్తాలో సంబురాలు చేసుకున్నారు. అమీర్పేట్ డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు హనుమంతరావు, ప్రధాన కార్యదర్శి సంతోష్ మణికుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి శేషుకుమారి విచ్చేశారు. నాయకులు ప్రవీణ్రెడ్డి, గొలుసుల సత్యనారాయణ, అశోక్యాదవ్, బాసా లక్ష్మి, కూతురు నర్సింహ, గౌతమ్రెడ్డి, గుడిగె సత్యనారాయణయాదవ్, వనం శ్రీనివాస్, నిమ్మ నరేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మంత్రికి శుభాకాంక్షలు…
మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అభ్యర్థిత్వం ఖరారు కావడంతో తలసాని యువసేన అధ్యక్షుడు సం కీర్త్ నేతృత్వంలో నాయకులు పెద్ద ఎత్తున పార్టీ ప్ర ధాన కార్యాలయానికి చేరుకున్నారు. ఈ మేరకు మంత్రికి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
సంబురాల్లో బీఆర్ఎస్ శ్రేణులు
బంజారాహిల్స్,ఆగస్టు 21: జూబ్లీహిల్స్ నియోజకవర్గం బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా మరోసారి ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పేరును పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించడంతో సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సంబురాల్లో పాల్గొన్నారు. జూబ్లీహిల్స్లోని ఎమ్మెల్యే మాగంటి క్యాంపు కార్యాలయంలో వివిధ డివిజన్ల నుంచి వచ్చిన కార్యకర్తలు నాయకులు ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్కు శుభాకాంక్షలు తెలిపారు. హ్యాట్రిక్ ఖాయమని కార్పొరేటర్లు దేదీప్యరావు, రాజ్కుమార్ పటేల్, సీఎన్.రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. వారంతా ఎమ్మెల్యే మాగంటిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
బోరంబడ చౌరస్తా వద్ద…
ఎర్రగడ్డ, ఆగస్టు 21: జూబ్లీహిల్స్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభర్థిగా ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పేరును సీఎం కేసీఆర్ ప్రకటించటంతో గులాబీ శ్రేణులు సంబురాలు చేసుకున్నారు. నేతలు లక్ష్మణ్గౌడ్, ఆనంద్, రవీందర్, శంకర్, దేవమణి, సూర్యకళ, రామకృష్ణ యాదవ్, జైభీమ్ యాదగిరి, భూపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్ శ్రేణుల ఆనందోత్సాహాలు
బన్సీలాల్పేట్, ఆగస్ట్ 21 : సనత్నగర్ నియోజకవర్గంలో భారీ మెజారిటీతో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ను గెలిపించుకుంటామని బన్సీలాల్పేట్ డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు వెంకటేశన్ రాజు అన్నారు. పద్మారావునగర్లోని జీహెచ్ఎంసీ పార్కు వద్ద అంబిక, దుర్గా, లక్ష్మి, అనిత, నాగలక్ష్మి, లావణ్య, వెంకటరమణ, వెంకట్, సురేశ్, శ్రీరాములు, రజనీశ్ పాల్గొన్నారు. బన్సీలాల్పేట్లోని అరుణ్జ్యోతి కాలనీలో ప్రేమ్కుమార్, భరత్కుమార్, నాగభూషణం, చిన్నా, సంపత్, కుమార్ యాదల ఆధ్వర్యంలో సంబురాలు నిర్వహించారు.