హైదరాబాద్ : ఓల్డ్ సిటీ బోనాల కోసం రూ.70 కోట్లతో పలు అభివృద్ధి పనులు చేపట్టామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.ఈ నెల 24 న జరిగే బోనాల ఉత్సవాల నిర్వహణ, ఏర్పాట్లపై సాలార్జింగ్ మ్యూజియంలో వివిధ శాఖల అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సీఎం కేసీఆర్బోనాలను రాష్ట్ర పండుగగా గుర్తించి ప్రతి యేడు ఉత్సవాలను గణంగా నిర్వహిస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు బోనాల ఉత్సవాల కోసం పక్కాగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ప్రజలు సంతోషంగా ఉండాలి. పండుగలు గొప్పగా జరుపుకోవాలనేది ముఖ్యమంత్రి అభిమతం అన్నారు.