హైదరాబాద్ : తెలంగాణకే పరిమితం అయిన బతుకమ్మ నేడు విశ్వవ్యాప్తంగా జరుపుకోవడం మనకు గర్వకారణం అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం మంత్రి తలసాని బన్సీలాల్పేటలో మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేసి మాట్లాడారు.
ప్రకృతిని పూజించే పండుగ బతుకమ్మ అన్నారు. ప్రకృతి పండుగను తెలంగాణ ఆడబిడ్డలు సంతోషంగా జరుపుకోవాలని ప్రభుత్వం ఉచితంగా బతుకమ్మ కానుకగా చీరలను పంపిణీ చేస్తుందన్నారు.
ఈ సంవత్సరం రూ. 340 కోట్లతో కోటి 18 లక్షల చీరల పంపిణీ చేస్తామన్నారు. పండుగలను గొప్పగా, సంతోషంగా జరుపుకోవాలనేది ప్రభుత్వ ఆకాంక్ష అని మంత్రి తెలిపారు. ఆయన వెంట స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు.