బేగంపేట్, మే 1: గత నెల 29న రాంగోపాల్పేట్ డివిజన్ కళాసీగూడలో నాలాలో పడి మరణించిన చిన్నారి మౌనిక కుటుంబానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వం మంజూరు చేసిన రూ.5లక్షల ఆర్థిక సాయం చెక్కును సోమవారం మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అందజేశారు.
కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ శ్రీలతారెడ్డి, జోనల్ కమిషన్ శ్రీనివాస్రెడ్డి, ఈఈ సుదర్శన్, మాజీ కార్పొరేటర్ అరుణగౌడ్, తదితరులు పాల్గొన్నారు.